రాయికల్ ప్రెస్ క్లబ్(జేఏసీ) ఆధ్వర్యంలో అర్చన ఐ కేర్ రాయికల్ వారి సౌజన్యంతో రాయికల్ పట్టణంలోని ప్రగతి విద్యాలయం లో 1200 మంది విద్యార్థులకు ఉచిత కంటి వైద్యపరీక్ష శిబిరన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాలే శేఖర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న పాత్రికేయులు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం శుభపరిణామం అని, సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు సామాజిక సేవే ధ్యేయంగా పనిచేస్తే, సమాజంలోని అసమానత రుగ్మతలు తొలగిపోతాయని వారు అన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న విధంగా ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తమ అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే శరీరంలో భాగమైన నేత్రాలను తరచు పరీక్షించుకోవాలని వైద్యులు సూచించారు. విద్యార్థులకు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించిన వైద్యులను, శిబిరాన్ని ఏర్పాటు చేసిన పాత్రికేయులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేత్ర వైద్యులు సుమన్,పర్వేజ్, పాఠశాల ప్రిన్సిపాల్ బాలే శేఖర్,డైరెక్టర్ బాలే నిఖిల్ కుమార్, రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్,ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్, కోశాధికారి మచ్చ శేఖర్, సీనియర్ పాత్రికేయులు సింగిడి శంకరయ్య,నాగమల్ల శ్రీకర్,ఎండీ.ముజఫర్, సయ్యద్ రసూల్,సింగని శ్యామ్ సుందర్,వాసం లింబాద్రి,కార్య వర్గ సభ్యులు కళ్లెం శ్రీనివాస్, లింబాద్రిగౌడ్ ,ఇమ్మ డి విజయ్,గంట్యాల ప్రవీణ్, ఎద్దండి జితేందర్, చెలిమల మల్లేశం,తీగల గోపి , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments 0