రాయికల్ మండలం లోని కుమ్మరి పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్ ఈ నెల 7 వ తేదీ నుంచి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని తక్కువ ఖర్చు మరియు ఖర్చు లేని బోధనోపకరణాలను రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేలా ప్రయోగాలు ప్రదర్శించగా ఈ నెల 21 నుండి పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము, జగిత్యాల జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, మండల విద్యాశాఖాధికారి శ్రీపతి రాఘవులు గారు తదితరులు అభినందించారు.
Your experience on this site will be improved by allowing cookies.