రాయికల్ మండలం లోని కుమ్మరి పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్ ఈ నెల 7 వ తేదీ నుంచి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని తక్కువ ఖర్చు మరియు ఖర్చు లేని బోధనోపకరణాలను రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేలా ప్రయోగాలు ప్రదర్శించగా ఈ నెల 21 నుండి పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము, జగిత్యాల జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, మండల విద్యాశాఖాధికారి శ్రీపతి రాఘవులు గారు తదితరులు అభినందించారు.