|
modi add 1

రహదారుల అంచుల్లో దాగి ఉన్న ప్రమాదం

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలం నుండి కోరుట్ల కు వెళ్లే రహదారిలో ‌ మైతాపూర్ బస్ స్టాప్ వద్ద గతంలో వర్షాల దాటికి ఆర్ అండ్ బి రోడ్డుకు వాహనదారుల భద్రత కోసం పోసిన మట్టి కొట్టుకుపోవడం వల్ల వాహనదారులు భయం గుప్పెట్లో ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం వాహనం పట్టు కూలిపోయిన ప్రాణాలకే నష్టం కలుగుతుంది. ఇప్పటికైనా అధికారులు రోడ్డుకు ఇరువైపుల మట్టి పోసి భద్రత కల్పించగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 19, 2024 | 0 Comments

*ప్రజా భవన్ ప్రజావాణి ఫిర్యాదు పై విజిలెన్స్ విచారణ

రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ నుండి రికవరీకి ఆదేశం జనం గొంతు//ఓదెల// పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో సుమారు రెండు కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన రోడ్డులో పలు అవకతవకలు జరిగాయి అంటూ గ్రామానికి చెందిన చిటికేసి సతీష్ కుమార్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయం దీనిపై విచారణకు ఆదేశించగా పెద్దపల్లి రహదారులు మరియు భవనాల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో విచారణ జరిపి, రోడ్డు నిర్మాణంలో తగు ప్రమాణాలు పాటించ బడలేదని నిర్ధారిస్తూ కాంట్రాక్టర్ జెఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ నుండి 5 లక్షల 79 వేల 224 రూపాయలు రికవరీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రజావాణి ఫిర్యాదు తదుపరి ఎలాంటి విచారణ జరపకుండానే ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై నామమాత్రపు రికవరీ విధించి చేతులు దులుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు చిటికేసి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. కనీసం 50 లక్షల విలువగల పని సైతం చేయకుండానే కాంట్రాక్టర్ కోట్లాది రూపాయలను జేబులో వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.టిఎస్ఎండిసి అధికారులు గతంలో ఈ రోడ్డు మరమ్మత్తులకు వెచ్చించిన మొత్తాన్ని సైతం కాంట్రాక్టర్ తన ఖాతాలో వేసుకొని దాని పైననే అరకొరగా పనులు నిర్వహించి రోడ్డు నిర్మాణంలో కోట్లాది రూపాయలు దండుకున్నారని తెలిపారు. కనగర్తి రోడ్డు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విచారణ జరిపించాలని 22 డిసెంబర్ 23 తేదీ న తాను ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే, 13 సెప్టెంబర్ 2023 రోజున విజిలెన్స్ విచారణ జరిపి రికవరీకి ఆదేశించామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. నిజానికి సీఎం కార్యాలయం నుండి ఆదేశాలు వెలువడిన అనంతరం క్షుణ్ణంగా విచారణ జరిపించాల్సిన అధికారులు అవేమీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్ తో కుమ్మక్కై, తమ తప్పిదాలు వెలుగులోకి రాకూడదు అనే దురుద్దేశంతో, పాత తేదీతో ఉత్తర్వులు సృష్టించి నామమాత్రపు రికవరీకి ఆదేశించి ఆర్ అండ్ బి అధికారులు తమ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ జరిపించకుండానే సీఎం కార్యాలయాన్ని సైతం తప్పుదోవ పట్టించే విధంగా, సెప్టెంబర్ నెలలోనే విజిలెన్స్ విచారణ జరిపించామని కాంట్రాక్టర్ నుండి రూపాయలు రికవరీకి ఆదేశించామని తెలుపుతూ ఉత్తరం సృష్టించి చేతులు దులుపుకోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. కొండంత అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ నుండి గోరంత రికవరీ కి ఆదేశించడం ఏమిటని వాపోయారు. గ్రామంలో ప్రజల సమక్షంలో సామాజిక తనిఖీ చేపడితే, రోడ్డు నిర్మాణంలో జరిగిన అక్రమాలన్నీ బహిర్గతం కాగలవని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఈ రోడ్డు నాణ్యతను స్వయంగా పరిశీలించి, మొత్తం రికార్డులను సరిచూసి అక్రమాలకు పాల్పడిన అధికారులు మరియు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేనియెడల కాంట్రాక్టర్ తో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన ఆర్ అండ్ బి అధికారులపై న్యాయపోరాటం చేయగలనని హెచ్చరించారు.

By NYALAKONDA ANIL DESAI | February 26, 2024 | 0 Comments

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి గారు ....

ఈరోజు మంగపేట మండల నరసింహ సాగర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరీ అనసూయ సీతక్క గారి చొరవతో మంజూరైన 10 లక్షల సిసి రోడ్డును కొబ్బరికాయ కొట్టి రోడ్డును ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి గారు ఈ కార్యక్రమం లో.... గ్రామ పార్టీ అధ్యక్షులు తాతినేని హరికృష్ణ, మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మండల ఉపాధ్యక్షులు గాదె శ్రావణ్ కుమార్, మండల సీనియర్ నాయకులు... లోకు సత్యం, అన్నాల వెంకన్న, కొంకర బుచ్చి రాములు, బండి రాములు, దోమల నరేందర్, కోడం శ్రీకాంత్, దోమల పుల్లారావు, బోడ సతీష్, చందా నరేష్, తదితరులు హాజరయ్యారు....

By NYALAKONDA ANIL DESAI | March 05, 2024 | 0 Comments

రోజుకు వెయ్యి గుంజి నెలకు వెయ్యి ఇవ్వటమే సామాజిక న్యాయమా

రోజుకు వెయ్యి గుంజి నెలకు వెయ్యి ఇవ్వటమే సామాజిక న్యాయమా అంటూ ఆటో వాలాలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో కదం తొక్కారు. ఈరోజు హైదరబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆద్వర్యంలో ఆటో డ్రైవర్లు తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరున రోజుకు వెయ్యి గుంజి నెలకు వెయ్యి ఇవ్వటడమే సామాజిక న్యాయమా అంటూ ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై నిరసన తెలియజేశారు. ప్రభుత్వ అనుచిత నిర్ణయాల కారణంగా జీవనోపాధి కోల్పోయినందున ఆ లోటు భర్తీ కొరకు ప్రభుత్వానికి పలు డిమాండ్లతో ఆటో కార్మికులు కదం తొక్కారు. పలు డిమాండ్ల పై ప్రశ్నించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు రోడ్డు పై ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నంద కిషోర్,ప్రధాన కార్యదర్శి బి.పెంటయ్య గౌడ్, గ్రేటర్ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి యన్.కిషన్, సోషల్ మీడియా ఇంచార్జీ సంతోష్ గౌడ్ , BPTMM సౌత్ సెంట్రల్ జోన్ ఇంచార్జీ హాబీబ్,BPTMM రాష్ట్ర కార్యదర్శి రాములు,స్కూల్ వాన్ డ్రైవర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి వజ్ర లింగం, BPTMM గ్రేటర్ ఇంచార్జ్ కృష్ణ మూర్తి, BPTMM జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 24, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1