రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు. సోమవారం రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే పట్టణంలోని బాలుర పాఠశాలలో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 250మందికి కంటి పరీక్షలు చేయగా 150మందికి కంటి ఆపరేషన్ కోసం గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు లయన్స్ క్లబ్ సుమారు 1800 మందికి కంటి ఆపరేషన్లతో పాటుగా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.పద్మశాలి సేవా సంఘంలో నిర్వహిస్తున్న ఆక్యుప్రెషర్ తెరఫీ చికిత్స శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో నిరుపేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ ఖయ్యూం, కంటి వైద్యులు డాక్టర్ ప్రభాకర్,లయన్స్ క్లబ్ డిసీలు మ్యా కల రమేష్,బత్తిని భూమయ్య,అధ్యక్షులు కొమ్ముల ఆదిరెడ్డి,ప్రధాన కార్యదర్శి మోసారపు శ్రీకాంత్,కోశాధికారి గంట్యాల ప్రవీణ్,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,కనపర్తి శ్రీనివాస్, ఎద్దండి దివాకర్,బొమ్మ కంటి నవీన్,మండలోజు శ్రీనివాస్,పారిపెల్లి శ్రీనివాస్,ఆడెపు రాంప్రసాద్,కుర్మా సుదర్శన్,కొత్తపెళ్లి రంజిత్,సామల్ల గోపాల్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత మెడికల్ క్యాంపులో ముందస్తు వ్యాధి నిర్ధారణతో ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు పొందవచ్చు మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు.శనివారం రాయికల్ పట్టణంలోని శ్రీ సత్య హాస్పిటల్, కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ శిబిరంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుశీల్,జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అందే ఉదయ్ కుమార్ లు150 మందిని పరీక్షించి అవసరమైన వారికి ఈసీజీ, టుడి ఈకో,బిపి,షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి రోగులకు పలు వైద్య సూచనలు అందించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధించిన వ్యాధులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి ఉచిత గుండె వైద్య శిబిరంతో వ్యాధిని గుర్తించి సకాలంలో వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. సుదూర ప్రాంతంలో ఉన్న కార్పొరేట్ వైద్యుల సేవలను గ్రామీణ స్థాయి ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా అందించిన శ్రీ సత్య హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్ ను అభినందించారు. రాయికల్ మండల ప్రజలకు భవిష్యత్తులో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,ఎస్సై అశోక్, మున్సిపల్ కౌన్సిలర్ మ్యాకల అనురాధ రమేష్,మాజీ ఎంపీపీ లౌవుడియా సంధ్యారాణి సురేందర్,మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామీణ వైద్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ మండలం రామోజీపేట గ్రామంలో ఆదివారం జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీ పావని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డా.శ్రీకాంత్ రెడ్డి, డా.పావని రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. హాస్పిటల్ వైద్యులు దాదాపు 200 మంది రోగులకు ఉచిత బిపి, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామ తాజ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ, వాన కాలంలో వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏమైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, జలేంధర్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ ప్రెస్ క్లబ్(జేఏసీ) ఆధ్వర్యంలో అర్చన ఐ కేర్ రాయికల్ వారి సౌజన్యంతో రాయికల్ పట్టణంలోని ప్రగతి విద్యాలయం లో 1200 మంది విద్యార్థులకు ఉచిత కంటి వైద్యపరీక్ష శిబిరన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాలే శేఖర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న పాత్రికేయులు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం శుభపరిణామం అని, సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు సామాజిక సేవే ధ్యేయంగా పనిచేస్తే, సమాజంలోని అసమానత రుగ్మతలు తొలగిపోతాయని వారు అన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న విధంగా ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తమ అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే శరీరంలో భాగమైన నేత్రాలను తరచు పరీక్షించుకోవాలని వైద్యులు సూచించారు. విద్యార్థులకు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించిన వైద్యులను, శిబిరాన్ని ఏర్పాటు చేసిన పాత్రికేయులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేత్ర వైద్యులు సుమన్,పర్వేజ్, పాఠశాల ప్రిన్సిపాల్ బాలే శేఖర్,డైరెక్టర్ బాలే నిఖిల్ కుమార్, రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్,ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్, కోశాధికారి మచ్చ శేఖర్, సీనియర్ పాత్రికేయులు సింగిడి శంకరయ్య,నాగమల్ల శ్రీకర్,ఎండీ.ముజఫర్, సయ్యద్ రసూల్,సింగని శ్యామ్ సుందర్,వాసం లింబాద్రి,కార్య వర్గ సభ్యులు కళ్లెం శ్రీనివాస్, లింబాద్రిగౌడ్ ,ఇమ్మ డి విజయ్,గంట్యాల ప్రవీణ్, ఎద్దండి జితేందర్, చెలిమల మల్లేశం,తీగల గోపి , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.