|
modi add 1

కనుమరుగవుతున్న రాయికల్ చరిత్ర

కనుమరుగవుతున్న రాయికల్ చరిత్ర రాయికల్//జనం గొంతు //ప్రవీణ్. జి రాయికల్ కు చారిత్రక ప్రాచీన నేపథ్యం ఉన్న పట్టణంగా పేరు ఉంది.దానికి చిహ్నంగా శ్రీ చెన్నకేశవ నాథ ఆలయం అనేక సంవత్సరాలు నుండి ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలాశాసనాలు విగ్రహాలు కట్టడానికి వినియోగించిన శిల్పాలను, రాళ్ళను గతంలో చరిత్రను సమాధి చేస్తూ అదే గుడికోట ప్రాంగణంలో పూడ్చి వేశారు. మరోసారి అదే తప్పు చేస్తూ నూతనంగా నిర్మాణం చేస్తున్న షెడ్డు తవ్వకాలలో బయట పడ్డా గుడి కోట రాతి విగ్రహాలను రాతి శిల్పాలను బండలను,అదే విధంగా మరల పూడ్చి పెడుతూ గొప్ప చారిత్రక ప్రాచీన కాలం నాగరికతను సమాధి చేస్తున్నారు, దేవదాయ శాఖ వైపల్యంతో పాటు దీనిపై సంబంధిత ఇంజనీర్ అధికారి పరివెక్షణా వైఫల్యం, కొందరు గుత్తే దారుల విమర్శలకు దారితీస్తుంది. చరిత్రక ఆధారాలను సమాధి చేస్తున్న వారిపై పురావస్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ లు ఎలాంటి చర్యలు తీసుకోక ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు పట్ల రాయికల్ పట్టణ వాసులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చరిత్రను కాపాడాలని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేస్తున్నారు.

By NYALAKONDA ANIL DESAI | November 03, 2023 | 0 Comments

ఘనంగా స్వామి వివేకానంద జయంతి

ఘనంగా స్వామి వివేకానంద జయంతి రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ప్రసంగాలు యువకుల్లో చైతన్యం నింపుతాయి. అందుకే ఆయన జయంతి రోజైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డే నిర్వహించాలని 1984లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. 1985 నుంచి ఏటా వివేకానందుడి ఆదర్శాలు కొనసాగేలా యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. జనవరి 12వ రోజును యువ దివస్ అని కూడా పిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు కొమ్ముల ఆది రెడ్డి, జెడ్ సి కాటిపెల్లి రామ్ రెడ్డి, డిసి బత్తిని భూమయ్య, కోశాధికారి గంట్యాల ప్రవీణ్, లయన్స్ సభ్యులు ఎద్దండి దివాకర్, కొత్తపెల్లి రంజిత్, వాసం ప్రసాద్ పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | January 12, 2024 | 0 Comments

హిందూ ధర్మ పరిరక్షణే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయం...

హిందూ ధర్మ పరిరక్షణే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయం... జిల్లా సహ శారీరక్ ప్రముఖ్ నూతికట్ల సత్యం... రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి హిందూ ధర్మ పరిరక్షణే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయమని జిల్లా సహ శారీరక్ ప్రముఖ్ నూతికట్ల సత్యం అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి ఉత్సవము, వివేకానంద జయంతి లలో ప్రధాన వక్త గా పాల్గొని ఆయన మాట్లాడుతూ సంక్రాంతి ప్రకృతిలో వచ్చే మార్పుల ఆధారంగా సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశి లో ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగ అని అన్నారు. హిందూ పండుగల్లో సామాజిక సమరత, ఐక్యత, సనాతన ధర్మ ఆచరణలు ఇమిడి వున్నాయని అన్నారు. సంఘం నిత్యశాఖ ద్వారా వ్యక్తినిర్మాణం చేస్తుందని, జాతీయ భావన, దేశభక్తి, సమర్పణ, త్యాగ భావాలను, ధైర్యాన్ని, మానసిక, శారీరక ధారుఢ్యాలను వికసింప జేస్తుందని, శాఖ మనోవిజ్ఞాన కేంద్రం గా పని చేస్తుందని అన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను సంఘం ఆచరిస్తుందని, యువత వివేకానంద ఆశయాలను స్ఫూర్తి గా తీసుకొని ఆదర్శవంతమైన శక్తివంతమైన యువశక్తి గా ఎదిగి దేశహితం కోసం లో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ నెల-22 న అయోధ్య లో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠతో 500 వందల సంవత్సరాల నుండి పోరాట చేసిన కోట్లాదిమంది హిందువుల కళ సాకరమవుతుందని, ఆ రోజున హిందువులందరు తమతమ నగరాల్లో, గ్రామాల్లో గల దేవాలయాలను దర్శించుకుని ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని టీవీల్లో తిలకించాలని, ఆ రోజు రాత్రి ప్రతీ ఇంటిలో ఐదు దీపాలు వెలిగించాలని, రెండు దీపాలు ఇంటి లో దేవుని వద్ద, రెండు దీపాలు ఇంటి ముఖ ద్వారం వద్ద, ఒకటి తులసీ మాత వద్ద వెలిగించాలని, ఐదు దీపాలు ఐదు వందల సంవత్సరాల పోరాట విజయానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ్ వేల్పుల స్వామి యాదవ్, కుర్మ మల్లారెడ్డి, దొంగ జితేందర్, సురేందర్, సుంకిశాల సత్యం, బయ్యని అంజి, లోకిని స్వామి, రొట్టె శ్రీధర్, గజ్బిన్కర్ కిరణ్, మహేష్, నవనీత్, పవన్, జశ్వంత్, శ్రీకర్, శ్రీమాన్, అభిరాం తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | January 12, 2024 | 0 Comments

ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థుల ఉత్తేజానికి 3 వేల నగదు విరాళం...

ప్రభుత్వం ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థుల ఉత్తేజానికి 3 వేల నగదు విరాళం... రామాజీపేట ప్రభుత్వ పాఠశాలకు దాతల కృషి, హిందీ పండిట్ ప్రోత్సాహం అభినందనీయం... గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్ రాయికల్ //జనం గొంతు// ప్రవీణ్. జి రాయికల్ మండలంలోని రామాజీపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణ సందర్బంగా వారికి ఉత్తేజం అల్పాహారానికై ఇదే గ్రామానికి చెందిన ప్రస్తుతం జగిత్యాలలో వుంటున్న సామాజిక కార్యకర్త, వ్యాపార వేత్త అయిలేని కృష్ణారెడ్డి విద్యార్థుల అల్పాహారానికై పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్, ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ లకు 3,వేల రూపాయల నగదు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలకు దాతల, గ్రామస్థుల సహకారం అభినందనీయమని, దాత అయిలేని కృష్ణారెడ్డి ని, దాతను ప్రోత్సహించిన పాఠశాల హిందీ పండిట్ వేల్పుల స్వామి యాదవ్ లనుఅభినందించారు.

By NYALAKONDA ANIL DESAI | February 10, 2024 | 0 Comments

బడ్జెట్‌లో విద్యారంగానికి పెరిగిన ప్రాధాన్యత పై హర్షం

బడ్జెట్‌లో విద్యారంగానికి పెరిగిన ప్రాధాన్యత పై హర్షం ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు గతం కంటే పెరగడాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా పక్షాన స్వాగతిస్తున్నామని జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు. 275891 కోట్ల బడ్జెట్ లో 21389 కోట్లు 7.75 శాతం విద్యారంగానికి కేటాయించడం, గత సంవత్సరం 6.7శాతం మాత్రమే కేటాయించారని, పాఠశాల విద్యకు 17931.42 కోట్లు గత సం. 16092 కోట్లు, ఉన్నత విద్యకు 2959.10 కోట్లు, 3001 కోట్లు, సాంకేతిక విద్యకు 487.64 కోట్లు కేటాయించారని మొత్తంగా విద్యారంగానికి కేటాయింపులు పెరిగినప్పటికీ కాంగ్రెస్ మానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా 15% కెటాయించలేకపోయారని, అయితే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకుల విద్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కెటాయించటం హర్షణీయని, మెగా డియస్సీ నిర్వహించాలని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తామని నిర్ణయించటం, ప్రతి మండలంలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు ప్రతిపాదించడం మంచి నిర్ణయమని, ఈ పాఠశాలలు మండలానికి ఒకటి కాకుండా జనాభా ప్రాతిపదికన అవసరమైనచోట అదనంగా ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే పబ్లిక్ స్కూల్స్ గా మార్చి అభివృద్ది చేయాలని భాషా పండితుల కు పదోన్నతులు కల్పించాలని, ఇప్పుడిస్తున్న ఐదు శాతం ఐ.ఆర్. మరో 25 శాతం కలిపి 30 శాతం ఇవ్వాలని కోరారు.

By NYALAKONDA ANIL DESAI | February 10, 2024 | 0 Comments

రాయికల్ లో ఘనంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలు

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు చంద్రశేఖర రావునీ తెలంగాణ ప్రజలు ఎన్నడు మర్చిపోరు మరియు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 4 వ వార్డు కౌన్సిలర్ తురుగా శ్రీధర్ రెడ్డి, 5 వ వార్డు కౌన్సిలర్ వల్ల కొండ మహేష్ బిఆర్ఎస్ నాయకులు పటేల్ శివ , రావిన్, వంశీకృష్ణ, సూర్య, వినోద్, శివ, రవితేజ, ఇతరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 17, 2024 | 0 Comments

ప్రధానమంత్రి జీవనజ్యోతి ఆధ్వర్యంలో 2 లక్షల చెక్కు పంపిణి

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండల్ రామాజీపేట గ్రామానికి చెందిన బండి రాధ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులైన బండి శ్రీనివాస్ కి ప్రధానమంత్రి జీవనజ్యోతి ఆధ్వర్యంలో 2 లక్షల చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎం ఆనందరావు బ్రాంచ్ మేనేజర్ పవన్ కుమార్ వి ఎల్ ఈ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.

By NYALAKONDA ANIL DESAI | February 17, 2024 | 0 Comments

10వతరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ZPHS ఆలూరు గ్రామ పాఠశాల యందు 10వతరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కూర్మాచలం రఘునందన్ గారు పదవ తరగతి ఏ విధంగా సంసిద్ధత కావాలి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎలా రూపొందించుకోవాలి అని అదేవిధంగా పరీక్షలు ఏ విధంగా రాయాలి. పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత పై తరగతులకు వెళ్లేటప్పుడు అందరూ ఒకరిని చూసి ఒకరు అనుకరించకుండా తమ తమ నైపుణ్యం ఆధారంగా పై తరగతికి సంబంధించిన కోర్సులలో చేరాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క బలాలు.... బలహీనతలు... అవకాశాలు... అవరోధాలు.... ఏలా ఎదుర్కోవాలి. నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, సంఘంలో సమాజంలో విద్యార్థుల పాత్ర అన్న మొదలైన విషయాలు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉదయభాస్కర్ గారు, ఉపాధ్యాయులు రాజగోపాల్ రమేష్ ,శ్రీనివాస్ , వినోద్, సంపత్ , స్వర్ణలత మొదలైన వారు పాల్గొన్నారు. రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ZPHS ఆలూరు గ్రామ పాఠశాల యందు 10వతరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కూర్మాచలం రఘునందన్ గారు పదవ తరగతి ఏ విధంగా సంసిద్ధత కావాలి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎలా రూపొందించుకోవాలి అని అదేవిధంగా పరీక్షలు ఏ విధంగా రాయాలి. పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత పై తరగతులకు వెళ్లేటప్పుడు అందరూ ఒకరిని చూసి ఒకరు అనుకరించకుండా తమ తమ నైపుణ్యం ఆధారంగా పై తరగతికి సంబంధించిన కోర్సులలో చేరాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క బలాలు.... బలహీనతలు... అవకాశాలు... అవరోధాలు.... ఏలా ఎదుర్కోవాలి. నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, సంఘంలో సమాజంలో విద్యార్థుల పాత్ర అన్న మొదలైన విషయాలు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉదయభాస్కర్ గారు, ఉపాధ్యాయులు రాజగోపాల్ రమేష్ ,శ్రీనివాస్ , వినోద్, సంపత్ , స్వర్ణలత మొదలైన వారు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 19, 2024 | 0 Comments

జీర్డ్స్" సేవా పురస్కారాలు పొందిన రాయికల్ మండలవాసులు

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జాన్స్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డేవలప్మెంట్ సొసైటి ఆధ్వర్యంలో '' జీర్ట్స్'' సేవ పురస్కార్ అవార్డ్స్ - 2024 ప్రదానోత్సవాన్ని మేడిపల్లి మండలం వెంకట్రావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జీర్ట్స్ స్వచ్చంద సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా చైర్మెన్ అంగడి ఆనంద్ జగిత్యాల జిల్లాలో వివిధ రంగాలలో విస్తృత సేవలు అందిస్తున్న 40 మందికి అవార్డులు ప్రధానం చేశారు.అందులో రాయికల్ పట్టణం నుండి కడకుంట్ల జగదీశ్వర్, ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి, బూరుగుల రాజేందర్, మొసరపు సంతోష్ మహితాపూర్ గ్రామం నుండి అజారుద్దీన్, గంగుల శ్రీనివాస్, ఆలూరు గ్రామం నుండి మెక్కొండ రాంరెడ్డి, ఎలిపెద్ది మల్లారెడ్డి, నర్సారెడ్డి లు అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని పలువురు అభినందించారు.

By NYALAKONDA ANIL DESAI | February 19, 2024 | 0 Comments

రహదారుల అంచుల్లో దాగి ఉన్న ప్రమాదం

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలం నుండి కోరుట్ల కు వెళ్లే రహదారిలో ‌ మైతాపూర్ బస్ స్టాప్ వద్ద గతంలో వర్షాల దాటికి ఆర్ అండ్ బి రోడ్డుకు వాహనదారుల భద్రత కోసం పోసిన మట్టి కొట్టుకుపోవడం వల్ల వాహనదారులు భయం గుప్పెట్లో ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం వాహనం పట్టు కూలిపోయిన ప్రాణాలకే నష్టం కలుగుతుంది. ఇప్పటికైనా అధికారులు రోడ్డుకు ఇరువైపుల మట్టి పోసి భద్రత కల్పించగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 19, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1