|
modi add 1

జీహాదిల స్వర్గధామం భాగ్యనగరం

విశ్వనగరంగా ప్రసిద్ధి చెందుతున్న హైదారాబాద్ నగరానికి దేశవిదేశాల నుండి విద్యా,వైద్యం,ఉపాదికోసం వస్తుంటారు.సుందరమైన కట్టడాలు,ఆహ్లదకరమైన వాతావరణం,సినీపరిశ్రమ,విశ్వవిద్యాలయాలు,వైద్యశాలలు,ఫార్మసూటికల్ పరిశ్రమలు హైదారాబాద్ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తున్నాయి.తెలాంగాణా సాధించుకున్నాక అభివృద్ధి పరుగులిడుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.దేశవిదేశాలకు చెందిన ఇస్లాం తీవ్రవాద సంస్థల మూలాలు అన్ని హైదారాబాద్ లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుతం తుఫాను ముందు ప్రశాంతతలాగా వుంది,కాని ఇది ఏనాటికైన ప్రమాదం కల్గించవచ్చు.హైదారాబాద్ నగరం లోని టోలిచౌకి,మీర్ పేట్,బార్కాస్,చాంద్రాయణగుట్ట,బాలాపూర్,మొఘల్ పురా,గోల్కొండ.టపాచపుత్ర,చార్మినార్ తో పాటు కరినగర్,జగిత్యాల,నిజామబాద్,బోధన్,కామారెడ్డి,సింగరేణి,ఆదిలాబాద్ లలో రోహింగ్యాలతోపాటు జిహాది స్లీపర్ సెల్స్ విస్తరించి ఉన్నారు.వీళ్ళకు కావలిసిన ఆధార్ కార్డు,ఓటర్ గుర్తింపు కార్డు,బ్యాంకు ఖాత,నివాసం కల్పించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థఉంది.ఇందుకోసం అధికారులను బెదిరించటం,రాజకీయ పార్టీలతో ఒత్తిడి చేయించడం జరుగుతుంది. తేది:07-04-2015 మంగళవారం రోజున వరంగల్ నుండి హైదారాబాద్ కు కోర్టు విచారణకు వికారుద్దిన్,సులేమాన్,జకీర్,అంజాద్,అనిఫ్ అనే ఇస్లాం తీవ్రవాదులను తీసుకువస్తుండగా వీరు పోలీసుల ఆయుధాలు లాక్కోని చంపే ప్రయత్నం చేయగా పోలిసులు ఆత్మరక్షణకోసం జరిపిన కాల్పుల్లో ఈ అయిదుగురు హతం అయినారు. ఈ సంఘటన TRS ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది,జాతీయస్థాయిలో KCR గారి పేరు మారుమ్రోగింది.వికారుద్దిన్ మొదట్లో చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉండేవాడు కాని ఇతను జైలు సిబ్బందిని,పోలీసులను తీవ్రంగా దుర్బాషలాడుతూ అవమానించేవాడు.అందువల్ల ఇతన్ని వరంగల్ జైలుకు మార్చారు.ఇతను అనేక మంది పోలీసులను హతమార్చాడు.ఈ ఎన్కౌంటర్ తరువాత AIMIM అధ్యక్షుడు అసదుద్దిన్ ఓవైసి రాష్ట్రప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.శుక్రవారం ప్రార్థన ల అనంతరం పాతబస్తీలో చాలా చోట్ల మసీదుల నుండి రాళ్ళు రువ్వారు.మీర్ చౌక్ లో ACP గంగాధర్ గాయపడ్డాడు అంటే తీవ్రత ఏంటో అర్ధం అవుతుంది.తరువాత ఏం జరిగిందో ఏమోకాని రాష్ట్రప్రభుత్వం మెతక వైఖరిని అవలంబించింది.15 ని!!లలో హిందువులను అందర్ని చంపుతానన్న అక్బరుద్దిన్ ఓవైసి నిర్ధోషిగా బయటపడ్డాడు.ACP సత్తెన్న తో పాటు ఎందరో IPS అధికారులను,పోలీసులను చంపిన వారు వివిధ కారణాలతో విడుదలచేయబడ్డారు. కొన్ని నెలల క్రిందట నిజామబాద్ నగరంలో PFI కి చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి అనేక మంది యువకులను సమీకరించి,సులువైన పద్దతిలో కాఫిర్ లు అయిన హిందువులను ఎలా చంపవచ్చో అని శిక్షణను ఇచ్చాడు. కరాటే శిక్షణ ముసుగులో ఈయన భైంసా,కరినగర్,జగిత్యాల,హైదారాబాద్,నెల్లూరు,కడప,ప్రకాశం,కర్నూలు లలో వందలాది మందికి శిక్షణను ఇచ్చాడు. 2020 మార్చి 30 న కరినగరంలో ఇండోనేషియా నుండి విజిటింగ్ వీసా పై వచ్చి మతకార్యక్రమాలలో పాల్గొని కరోనా వ్యాప్తికి 11 మంది కారకులు అయినారు,IOM ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథ్స్ నిర్వహకుడు మరియు PFI జిల్లా నాయకుడు జమీల్ అహ్మద్ కరోనా నిభంధనలకు విరుద్ధంగా లాక్డౌన్ కాలంలో తరగతులు నిర్వహించి కరోనావ్యాప్తి కి కారకులు అయినారని ఇది క్లినికల్ జీహాద్ లో భాగమని పలువురు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ISKP "ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్ ప్రావిన్స్" స్థాపనే ధ్యేయంగా సూరత్ కు చెందిన సుబేరా బాను,హైదరాబాదుకు చెందిన ఖదీజా అలియాస్ అబిదాను గుజరాత్ ATS పోలీసులు అరెస్టు చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.సుబేరా బాను మరియు హైదరాబాదుకు చెందిన అబీదా గుజరాత్ లోని పోరుబందర్ లో బోట్ ను హైజాక్ చేసి అఫ్ఘనిస్తాన్ వెళ్ళాలనుకున్నారు.జర్మనీలో ఉంటున్న తన మిత్రుడు అలీ ద్వారా కాలపత్తర్ లో "లైఫ్ మెడికల్ హాల్" నిర్వాహకుడు సయ్యద్ ఫసియుల్లా తో పరిచయం ఏర్పడిందని సుబేరా బాను పోలీసుల విచారణలో తెల్పింది.పాకిస్తాన్ జీహాదీలు మరియు కాశ్మీర్ జీహాదీలతో సంభందాలు ఉన్నాయని ఆమే ఒప్పుకొంది.మహ్మాద్ జావేద్ అతని కూతురు ఖతీజా రామగుండంలో గుజరాత్ ATS పోలీసులు అరెస్టు చేయటంతో తెలాంగాణా ఉలిక్కిపడింది. మధ్యప్రదేశ్ ATS పోలీసులు హైదరాబాదుకు చెందిన అయిదుగురు ఇస్లాం తీవ్రవాదులను అరెస్టు చేశారు,అరెస్టు అయినవారంతా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కావటం గమనార్హం.తాజాగా మీర్ చౌక్ పోలీసు స్టేషన్ ఫరిదిలో సులేమాన్ అనే ISIS తీవ్రవాదిని అదుపులోకి తీసుకొన్నారు,గతంలో అతనికి SOT పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అతని వైఖరిలో మార్పు రాలేదు.కేంద్ర భద్రత బలగాలు హైదరాబాదు ఇస్లాం తీవ్రవాదుల అడ్డాగ మారటాన్ని జీర్ణించుకోలేక పోతున్నాయి.మధ్యప్రదేశ్ ATS పోలీసులు మరియు తెలాంగాణా కౌంటర్ ఇంటలిజెన్సి నిర్వహించిన దాడిలో హైదరాబాదులోని జవహర్ నగర్ కు చెందిన సలాం అలియాస్ సల్మాన్ తో పాటు మరో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.సలీం అలియాస్ సల్మాన్ "హిజ్బ్ ఉల్ తహరీర్" అనే సంస్థను స్థాపించినాడు ఇతను స్థానిక ప్రజలకు అమాయకంగా కనిపిస్తూ ఆయుధాలను సేకరించాడు,ధనవంతులు,విద్యావంతులు,ఉన్నత ఉద్యోగులను తన తీవ్రవాద సంస్థలో చేర్చుకొన్నాడు.ఒడిసాకు చెందిన అబ్దుల్ రెహమాన్ అనే క్లౌడ్ ఇంజనీరు,డెంటిస్ట్ షేఖ్ జునైద్,యాఖుబ్ లు అరెస్టైన వారిలో ఉన్నారు.అసదుద్దిన్ ఓవైసి కి చెందిన విద్యాసంస్థలలో పనిచేసే ప్రొఫెసర్ లు కూడా అరెస్టైన వారిలో ఉన్నారు.విచిత్రమేమిటంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అంశాల పట్ల ఆందోళన చెందకపోవటం. ఇప్పుడు ఈ సమస్యలన్ని పరిష్కరించగలిగే పార్టీని హిందువులు గుర్తించాలి. స్వార్ద రాజకీయనాయకులు,అధికారమే పరమావధిగా పనిచేసే కుటుంబపార్టీలకు గుణపాటం చెప్పాలి. మత తీవ్రవాదాన్ని నిర్ధాక్షిణ్యంగా అణచివేసే నాయకున్ని మనం ఎన్నుకోవాలి.హిందువులు తమ పిల్లలని భారతసైన్యంలోని అగ్నిపథ్ లో చేర్పించాలి.స్వీయ రక్షణ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి.అనుమానితుల సమాచారాన్ని పోలిసులకు తెల్పటం మన బాధ్యతగా గుర్తించాలి. జై హింద్. వ్యాసకర్త రుద్రోజు శ్రీనివాస్ సామాజిక కార్యకర్త కరినగర్ సెల్ నం.9440763351

By NYALAKONDA ANIL DESAI | October 29, 2023 | 0 Comments

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి -ఆదివాసి కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు కన్నెపెల్లి లో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం -నేటి నుంచి మహా ఘట్టం వనం నుండి జనం లోకి వన దేవతలు -భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యు లైన్లు ఏర్పాటు చేశాం -సామాన్య ప్రజలే మకు విఐపి వీవీఐపీలు లు -మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది -ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుంటారు

By NYALAKONDA ANIL DESAI | February 21, 2024 | 0 Comments

చంద్రశేఖర అజాద్

జన్మస్థలం: బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం నిర్యాణ స్థలం: అలహాబాదు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం ఉద్యమం: భారత జాతీయ ఉద్యమం ప్రధాన సంస్థలు: నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ, హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ బాల్యము మార్చు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర అజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాసిలో చదివించాలను పట్టుదల వుండేది. కాని ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్లొదిలి ముంబయి పారి పోయాడు. ముంబయిలో ఒక మురికి వాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పనిచేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. రెండేళ్ళ ఆ మురికి వాడలో నికృష్టమైన జీవనం తర్వాత 1921 లో వారణాసికి వెళ్ళిపోయి అకడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అదే సమయంలో భారత స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికినట్టున్నది. అప్పుడే చంద్ర శేఖర్ తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించు కున్నాడు. అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున సంస్కృత పాఠశాలముందే ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయ మూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తల తిక్క సమాదానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే జైలు అని తల తిక్క సమాదానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 రోజులు జైలు శిక్ష విధించాడు. ఇతని తలతిక్క సమాదానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమోగాని తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్వ బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్ .... చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు. ఈలోపు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు. దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కులో తమ ఇతర విప్లవ మిత్రులతో భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులున్నారని అనుమానమొచ్చింది ఆజాద్ కి. వెంటనే తన రివ్వార్ కి పని చెప్పాడు. ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అజాద్ ని వెంబడిస్తూనే ఉన్నారు. ఆజాద్ వారిని తన రివ్వాల్వర్తో నిలవరిస్తూనే ఉన్నాడు.తన తుపాకీలో ఇంకో తూటానే మిగిలి ఉంది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. చీ బ్రిటిష్ వారికి తాను పట్టుబడటమా అంతే మరో క్షణం ఆలోసించ లేదు ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకి తన తలవైపు మళ్ళింది. అంత 25 ఏండ్ల యువకుడు చంద్రశేఖర ఆజాద్ అమరుడయ్యాడు.. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్ ను ఉరి తీశారు. చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) 1906 జూలై 23 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . ఈయన భారతీయ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు - చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు...చంద్రశేఖర్ అజాద్.కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని అతను ఆశయాల సాధనలో భాగమవుదాం . సీతారాం తివారీ, జగరాణి దేవీల ఐదో సంతానంగా జన్మించిన చంద్రశేఖర్‌ అజాద్‌ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచి ధైర్యసాహసాలు చూపేవారు. ప్రజల నుంచి మహాత్మాగాంధీ వరకు నీరాజనాలు అందుకుంటున్న రోజులవి. 1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్‌ కూడా జనంతో కలిసి వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాల చేస్తుంటే పోలీసులు కొట్టారు. ఇది సహించలేక రాయిని గురి చూసి పోలీసులను కొట్టి అదృశ్యమయ్యాడు. బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా 1857లో స్వాతంత్ర్య సమరజ్వాలలు ఎగసిపడినాయ. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం సిద్ధించేవరకూ గడచిన 90 ఏళ్లలో దేశ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు సాగాయి. పంజాబ్‌లో రామసింగ్ కూకా (నాంధారీ ఉద్యమం), మహారాష్టల్రో వాసుదేవ బల్వంత్‌ఫడ్‌కే, ఛపేకర్ సోదరులు, భగత్‌సింగ్, యస్ఫతుల్లాఖాన్, రాజగురు, రాంప్రసాద్, బిస్మిల్, భగవతీచరణ్, అల్లూరి సీతారామరాజు, కుమరంభీం, చంద్రశేఖర్ అజాద్.. ఇంకా అనేకమంది వీరుల బలిదానాలు కొనసాగాయి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని బావరా గ్రామంలో జగరాణిదేవి, సీతారాం తివారీల కడుపుపంటగా చంద్రశేఖర్ తివారీ జన్మించాడు. అతనుే చంద్రశేఖర్ అజాద్. 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్ర్య సమర యజ్ఞంలో ఆహుతయ్యేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైనాడు ఆజాద్.15 ఏళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం సర్వ సమర్పణకు సంసిద్ధమైనవాడు చంద్రశేఖర్ అజాద్. 1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖదేవ్ రాజ్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఓ చెట్టుకింద అజాద్ కూర్చుని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డితిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. నాలుగు వ్యాన్‌లలో పోలీసులను ఎక్కించుకుని పోలీసు అధికారులు లార్ట్‌బావర్, విశ్వేశ్వర సిన్హాలు ఆల్‌ఫ్రెడ్ పార్క్‌కు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ అజాద్ తొడ నుండి దూసుకుపోయింది. అయినా, బాధను లెక్కచేయక అజాద్ తన రివాల్వర్‌తో లార్ట్ బావర్‌ను కాల్చాడు. విశ్వేశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా అజాద్ కుడిచేతికి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి వున్న పోలీసు బలగాలు గుళ్ల వర్షం కురిపిస్తుండగా అజాద్ తన రివాల్వర్‌తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్‌లో ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖదేవ్ రాజ్ సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకు పోయేందుకు సహకరించాడు. ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు. అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ.

By NYALAKONDA ANIL DESAI | February 27, 2024 | 0 Comments

విశిష్టమైనది భారతీయ కాలగణన – ఉగాది ప్రత్యేకం

గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన. కాలం దైవస్వరూపం, అనంతమైనది. ఈ సృష్టి అన్వేషణకు కాల గణనే మూలం. మనదేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైనది. ‘అసు సృష్టి ప్రారంభమై ఇప్పటికి నూట తొంబై ఐదు కోట్ల యాభై ఎనిమిది ల‌క్ష ఎనబది ఐదువేల ఎనభై ఒక‌టి సంవత్సరాలు (195,58,85,083) అయినట్లు లెక్క తెలుపుతున్నది. ఆధునిక శాస్త్రపరిజ్ఞానం లెక్క ప్రకారం కూడా దాదాపు మన పూర్వులు చెప్పిన లెక్కకు దగ్గరగా ఉన్నది. మన కాలగణనలో మన్వంతరము, యుగాులు, సంవత్సరాలు, మాసాలు, పక్షము; రోజులు ఉంటాయి. అందులో 14 మన్వంతరాలు. ఆ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం 7వదయిన వైనస్వత మన్వంతరం నడుస్తున్నది. ఒక మన్వంతరము అంటే 71 మహాయుగాలు; ఒక మహాయుగము అంటే నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు). ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగము ప్రారంభమై ఇప్పటికి 5125 సంవత్సరము పూర్తి అయింది. ఈ ఉగాదితో 5126 సంవత్సరములోకి ప్రవేశిస్తున్నది. మన కాలగణనలో సంవత్సరము ఆవర్తము ఉన్నది. 60 సంవత్సరాు ఒక ఆవర్తము. ఈ అరవై సంవత్సరా ఆవర్తములో 37వ సంవత్సరమైన శుభ‌కృత్‌ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ ఉగాదితో 38 సంవత్సరమైన క్రోధి నామ సంవత్సరంలో ప్రవేశిస్తాము. కలియుగము ఎప్పుడు ప్రారంభమైంది ? మహాభారత సంగ్రామం తరువాత 36 సంవత్సరాలకు భగవాన్‌ శ్రీకృష్ణునిచే నిర్మింపబడిన ద్వారకపట్టణము సముద్ర గర్భంలో కలిసిపోయిన అర్థరాత్రి నుండి కలియుగం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రచారములో ఉన్న క్రీస్తుకు పూర్వము; క్రీస్తు శకము లెక్కల ప్రకారం క్రీస్తుపూర్వము 3101 ఫిబ్రవరి 20వ తేదీ అర్థరాత్రి 2 గం. 27 ని॥ 30 సెకండ్లకు అంటే 3101+2024 = 5125 సంవత్సరాు ఇప్పటికే పూర్తి అయ్యి 5126 లో ఈ ఉగాది నాడు ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 09 ఉగాది నుండి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమౌతుంది. ఇంతటి శాస్త్రీయమైనది మన కాలగణన. దేశచరిత్రలో కొన్ని తిరుగులేని విజయాలను మనవాళ్ళు శకాలుగా పేర్కొన్నారు. అందులో ప్రసిద్ధమైనవి 1) యుధిష్ఠిర శకము, 2) విక్రమార్క శకము, 3) శాలివాహన శకము. భారతదేశానికి ఉత్తరభాగం వారు విక్రమార్క శకమును, దక్షిణాపథం వారు శాలివాహన శకమును చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేశ చరిత్రల మలుపు త్రిప్పిన ఘట్టాను పదేపదే జ్ఞాపకం చేసుకొంటూ మనలో ధర్మనిష్టను; పౌరుష పరాక్రమాలను పెంపొందించుకోవటం ప్రధాన లక్ష్యం. ఆ శకాల గురించి సంక్షిప్తంగా తెలుసుసుకునే ప్రయత్నం చేద్దాం. యుధిష్ఠిర శకం యుధిష్ఠిర శకం కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ద్వాపర యుగ అంతంలో ప్రారంభమైంది. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం సాధించారు. తరువాత ధర్మరాజుకు సామ్రాట్టుగా పట్టాభిషేకము జరిగింది. ఆ రోజు నుండి యుధిష్ఠిర శకం ప్రారంభం అయింది. అది జరిగి ఈ ఉగాదికి 5161 సంవత్సరాలు పూర్తయి, 5162వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు 36 సంవత్సరాలు పరిపాలన చేసాడు. ఆ తరువాత కలియుగం ప్రారంభమైంది. అంటే కలియుగం ప్రారంభానికి 36 సంవత్సరాలకు పూర్వం యుధిష్ఠిర శకం ప్రారంభమైంది. యుధిష్ఠిర శకం మనకు ఇచ్చే సందేశం ఎప్పుడైనా అంతిమ విజయం ధర్మానిదే అని. మహాభారత సంగ్రామం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటం. అది ధర్మం జయించిన వేళ. విక్రమార్క శకం కలియుగంలో 3044 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పుడు 2080 సంవత్సరాు పూర్తి చేసుకొని 2081వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. విక్రమార్కుని కాలం నాటికి భారతదేశం మీద శకుల, హూణుల దండయాత్ర‌ జరుగుతుండేవి. చిన్న వయస్సులోనే విక్రమార్కుడు ఈ దాడులను త్రిప్పికొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. 5 సంవత్సరాల వయస్సులోనే అరణ్యంలోకి వెళ్లి 12 సంవత్సరా పాటు సుదీర్ఘ సాధన చేసి అద్భుత శక్తులు సంపాదించాడు. అతను మాళవ ప్రాంతంలోని ఉజ్జయినీని రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు. జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని ఒకటి. విక్రమాదిత్యుడు శకులు హూణులను జయించటానికి భయంకరమైన యుద్ధాలు చేశాడు. శకులు హూణుల భాధలు మనకే కాదు అరేబియా; బాబిలోనియా; పర్షియాకు కూడా ఉండేవి. విక్రమార్కుడు అక్కడకు కూడా వెళ్ళి శకులు హూణులను తరిమి కొట్టాడు. అరబ్బు ప్రజు విక్రమాదిత్యుడిని తమకు స్వేచ్ఛ స్వతంత్రం ప్రసాదించిన రాజుగా కీర్తించారు. అరేబియాలో మహాదేవుని మందిరం నిర్మాణం చేసారు. అట్లాగే విక్రమాదిత్య మహారాజు అయోధ్య పట్టణాన్ని అన్వేషించి అక్కడ రాముడు జన్మించిన స్థలము గుర్తించి అక్కడ భవ్యమైన రామమందిరం నిర్మాణం చేసాడు. ఈ విషయలు కాళిదాసు రచించిన గ్రంథాల ద్వారా మనకు తెలుస్తాయి. శకులు, హుణుల బారి నుండి ఈ దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుడి పేరుతో విక్రమార్క శకం ప్రారంభమైంది. శాలివాహన శకం ఇది కలియుగంలో 3179వ సంవత్సరంలో ప్రారంభమైనది. అంటే శాలివాహన శకం ప్రారంభమై ఇప్పటికి 1945 సంవత్సరాలు పూర్తి అయి, 1946 సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనుమడు. శాలివాహనుడు విదేశీయులైన శకులను సంపూర్ణంగా నాశనము చేసి దేశ సరిహద్దులు దాటి వారి రాజ్యాలలోకి ప్రవేశించి వాళ్ళు దోచుకొని పోయిన సంపదనంతటిని తిరిగి ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఈ దేశానికి మూడు రాజధానులను ఏర్పాటు చేసుకుని ఒకే ఛత్రం క్రింద దేశాన్ని పరిపాలించిన ధీరుడు. శకులపై విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది. ఆయన కాలంలో ఈ దేశంపై దాడిచేసిన విదేశీయులను సంపూర్ణంగా నాశనం చేసి భారత్‌ను శక్తివంతం చేశాడు. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవటానికి విక్రమార్క, శాలివాహన శకాలు ఏర్పడ్డాయి. ఈ శకాలు మనకు ఇప్పుడు ఇచ్చే సందేశం ఏమిటంటే శతాబ్దాల భావదాస్యాన్ని వదిలించుకొని వేయి సంవత్సరాల విదేశీ దాడులకు చరమగీతం పాడాలి. మన దేశం స్వాభిమానంతో నిలబడి, ప్రపంచానికి శాంతి బాటలు వేసి, మరో క్రొత్త శకం ప్రారంభం కావాలి. ఈ ప్ల‌వ నామ సంవత్సరం అందరికీ ఇటువంటి ప్రేరణ ఇవ్వాలని కోరుకుందాం. – రాంపల్లి మల్లికార్జునరావు

By NYALAKONDA ANIL DESAI | April 09, 2024 | 0 Comments

దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన కుమ్మరి పల్లి ప్రధానోపాధ్యాయుడు

రాయికల్ మండలం లోని కుమ్మరి పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్ ఈ నెల 7 వ తేదీ నుంచి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని తక్కువ ఖర్చు మరియు ఖర్చు లేని బోధనోపకరణాలను రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేలా ప్రయోగాలు ప్రదర్శించగా ఈ నెల 21 నుండి పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము, జగిత్యాల జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, మండల విద్యాశాఖాధికారి శ్రీపతి రాఘవులు గారు తదితరులు అభినందించారు.

By Gantyala Praveen | January 09, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1