జనంగొంతు/గోదావరిఖని/అంబటి సతీష్/ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరి నది ఒడ్డున గల సమ్మక్క సారక్క జాతర ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు. ఈ జాతరకి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నుండి వేలాది మందిగా జాతరకి హాజరవుతారని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కార్పొరేషన్ మరియు సింగరేణి సంస్థ వారి సహకారంతో కల్పించామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు.
ఖని ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్. గోదావరిఖని/జనంగొంతు/అంబటి సతీష్/9666033355/ ఈ రోజు గోదావరిఖని లోని స్థానిక గాంధీనగర్ లో గాలి సంతోష్ (సతీష్) నివసిస్తూ గత రెండు సంవత్సరాల నుండి క్యాన్సర్ వారితో బాధపడుతూ గత 13 రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడం జరిగింది. చనిపోయిన ఫోటోగ్రాఫర్ గాలి సంతోష్( సతీష్) కుటుంబానికి అసోసియేషన్ ద్వారా₹ 33030/- ఆర్థిక సహాయం గోదావరిఖని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జమ చేసినటువంటి₹ 33030/- రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. చనిపోయిన ఫోటోగ్రాఫర్ గాలి సంతోష్ కు ఇద్దరు చిన్నపిల్లలు కుమారుడు కుమార్తె, ఇట్టి ఆర్థిక సహాయం చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారులు బైరం సతీష్, అధ్యక్షులు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్ కోశాధికారి బండారి ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు గూడూరు శ్యాంసుందర్ , దుస్స మహేష్, తోగటి శ్రీధర్, గూడెల్లి శ్రీనివాస్ , రామగిరి శ్రీనివాస్ గడమల్ల రఘు, మోర విక్రమ్, గూడూరు పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
- రామగుండం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసిన విశ్వహిందూ పరిషత్ గోదావరినదిలో పుష్కరఘాట్కు కు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు కలుగకుండా, అంటు వ్యాధులు ప్రబలకుండా గోదావరినదిలో చెత్తాచెదారం తొలగించడంతో పాటు ఒడ్డున మరియు దారుల వెంట పారిశుధ్య నిర్వహణతో గోదావరి వద్ద భక్తులు వేసవి దృష్ట్యా ఎండలో వేచి ఉండేలా కాకుండా నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, గోదావరినది ఒడ్డున పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయడంతో పాటు షవర్లు ఏర్పాటు చేయాలి,తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు మంచినీటి సౌకర్యం, తగినంత మంది లైఫ్ సేవర్స్ మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, సహ కార్యదర్శి కొండపర్తి లింగన్న,సంపత్, నగరబజరంగ్దళ్ సంయోజక్ దిగంబర్ సహసంయోజక్ అరవింద్, ఆరెల్లి జలంధర్, చక్రపాణి, బాలు,అనిల్,కిరణ్, సురేష్, కార్తీక్, దుబాసి తిరుపతి, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.