రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి శ్రీ గంగా సహిత పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం సోమవారం రోజున మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో రాయికల్,చెర్ల కొండాపూర్ పెద్ద చెరువు కట్ట పైన గల శ్రీ గంగా మాత దేవాలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా జాతర మరియు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అన్నదాన కార్యక్రమం జరిగినది. ఇట్టి మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్,బిజెపి నేత భోగ శ్రావణి మరియు మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మరియు కౌన్సిలర్లు, దేవుని నారాయణ, భూమయ్య రవీందర్, ధర్మపురి, రాములు రమేష్,రాజేష్ మరియు ఐదు వాడకట్ల పెద్దమనుషులు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.