|
modi add 1

వేసవి ని దృష్టిలో ఉంచుకుని మంచి నీటి ఎద్దడిని నివారణకు చర్యలు వెంటనే చేపట్టాలి.. భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్

వేసవి ని దృష్టిలో ఉంచుకుని మంచి నీటి ఎద్దడిని నివారణకు చర్యలు వెంటనే చేపట్టాలి.. భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ * జనం గొంతు / కోదాడ :రానున్న వేసవి ని దృష్టిలో ఉంచుకుని మంచి నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ శుక్రవారంఒక ప్రకటన లో ప్రభుత్వాన్ని కోరారు.ఈ సవంత్సరం లో తీవ్రమైన ఎండలు ఉండబోతున్నాయి అని సంబంధిత అధికారులే ముందస్తు హెచ్చికలు చేస్తున్నారని, కాని నీటి ఎద్దడి కి తీసుకుంటున్న చర్యలు ఏమిటో ఇప్పటివరకు ప్రభుత్వం నుండీ ఏలాంటి ప్రకటనలు రాకపోవడం శోచనీయం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కరువు, కాటకాలు మరియు నీటి ఎద్దడికి ప్రత్యేక నిధులు కేటాయింపులు చేయక పోతే ఎలా అని ప్రశ్నించారు.సూర్యాపేట జిల్లాలో ఇప్పటి కే కొన్ని దళిత,గిరిజన ప్రాంతాల్లో మంచి నీళ్ళ కొరకు వ్యవసాయ బోరు బావులు దగ్గర నీళ్ళ కోసం బారులు తీస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.గత బిఆర్ ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కొరకు వేల కోట్ల రూపాయలు కేటాయించారని దానిపై వందలాది మంది కార్మికులు పని చేస్తున్నపటికి అన్నిగ్రామాలకు త్రాగునీరు అందడంలేదన్నారు.జిల్లాలో, మండలలో వచ్చే మిషన్ భగీరథ నీటి సరఫరా కు పాలేరు నీటి నిల్వలు పడి పోవడం వల్ల మండలం లో మిషన్ భగీరథ నీటి సరఫరా లో ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉందన్నారు.సూర్యాపేట జిల్లా కలెక్టర్ నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని కోరారు...

By NYALAKONDA ANIL DESAI | February 23, 2024 | 0 Comments

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : మంత్రి దినసరి అనసూయ

పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ ధనసరి అనసూయ సీతక్క 02-03-2024 న మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్- చీఫ్ ఆఫీస్, ఎర్రమంజిల్, హైదరాబాద్ లో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి పై పూర్తిస్థాయి సమీక్ష జరిపారు. ఈసందర్భంగా రాష్ట్ర లో వేసవిలో నీటి సరఫరా విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అని అదికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి వనరులైనటువంటి రిజర్వాయర్ల వారీగా ప్రస్తుతం ఉన్న నీటి నిలువలపై సమక్షించారు. రిజర్వాయర్లు మరియు నదుల వంటి తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని గౌరవనియ మంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాలు, ఆవాసాలు, తండాలు, గుడాలకు ప్రతిరోజు తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ప్రత్యేకంగా పూర్వపు అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని పంపుసెట్ల సమస్యను త్వరితంగా పరిష్కరించి వేసవిలో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. పైపులైన్లు పగిలిపోయిన లీకైన వెంటనే వాటిని సరిదిద్దు నీటి సరఫరాను అదే రోజు పునరుద్ధరించాలి ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదని ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో తాగునీటి అవసరాల నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో ఒక కోటి రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయి అవసరాలను గమనించి జాగ్రత్తగా వినియోగించుకోవాలని వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని గౌరవ మంత్రివర్యులు సూచించారు. ఈ వేసవిలో తరచూ సమీక్షలు నిర్వహించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. చీఫ్ ఇంజనీరింగ్, సూపరింటెండింగ్ ఇంజనీర్లు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. మండల స్థాయి మిషన్ భగీరథ ఇంజనీర్లు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలి. సమీక్ష సమావేశంలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంజనీరింగ్ చీప్ కృపాకర్ రెడ్డి తో పాటు ఇతర మిషన్ భగీరథ చీఫ్ఇంజనీర్లు,సూపరింటెండింగ్ ఇంజనీర్లు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | March 04, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1