-వ్యక్తిగత గొడవలను అధికార పార్టీ పై రుద్దడం సిగ్గు చేటు -ఇంచేర్ల గ్రామములో జరిగిన సంఘటన పై రాజకీయాలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు -మా కార్యకర్త శనబోయిన అశోక్ ఇంటి పై గుండాల తో దాడి చేయించింది బిఆర్ఎస్ పార్టీ -కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ నిన్న సాయంత్రం ములుగు మండలం ఇంచేర్ల గ్రామములో జరిగిన ఘటన పై పూర్తి స్థాయిలో పోలీస్ లు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శనబోయిన అశోక్ పై ఇదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మామిడి అశోక్ కొంత మంది గుండాల తో ఇంటి పై దాడి చేసి అతనిని తీవ్రంగా కొట్టడం తో పాటు అతని బైక్ కారు ను ద్వంసం చెయ్యడం తో ఆత్మ రక్షణ కోసం కత్తి పడితే మమ్ముల చంపడం కోసం అని బిఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం సిగ్గు చేటని గత కొన్ని సంవత్సరాలుగా శానాబోయిన అశోక్, మామిడి అశోక్ లకు వ్యక్తిగత గొడవలు ఉన్నాయని పలుమారు ఒకరి పై ఒకరు పోలీస్ స్టేషన్లో పిర్యాదులు కూడా చేసుకోవడం జరిగిందని వ్యక్తిగతంగా జరిగిన గొడవను అధికార పార్టీ పై రుద్దడం హాస్యాస్పదం 10 యేండ్లు పాలించిన బిఆర్ఎస్ పార్టీని మొన్న జరిగిన ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించిన వాళ్ళ బుద్ది మారటం లేదని మీలాగా మేము అక్రమ కేసులు పెట్టడం ఇండ్ల పైన దాడి చెయ్యడం మా నైజం కాదని తప్పు చెయ్యం తప్పు చేసిన వారిని ఎంతటి వారైనాన ఓదలి పెట్టం అని పోలీసులు ఇన్న జరిగిన ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మా కార్యకర్త పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బిఆర్ఎస్ గుండాలపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు
Your experience on this site will be improved by allowing cookies.