|
modi add 1

గోదావరి నది తీరంలోని చెత్తాచెదారాన్ని తొలగించండి.

- రామగుండం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసిన విశ్వహిందూ పరిషత్ గోదావరినదిలో పుష్కరఘాట్కు కు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు కలుగకుండా, అంటు వ్యాధులు ప్రబలకుండా గోదావరినదిలో చెత్తాచెదారం తొలగించడంతో పాటు ఒడ్డున మరియు దారుల వెంట పారిశుధ్య నిర్వహణతో గోదావరి వద్ద భక్తులు వేసవి దృష్ట్యా ఎండలో వేచి ఉండేలా కాకుండా నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, గోదావరినది ఒడ్డున పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయడంతో పాటు షవర్లు ఏర్పాటు చేయాలి,తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు మంచినీటి సౌకర్యం, తగినంత మంది లైఫ్ సేవర్స్ మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, సహ కార్యదర్శి కొండపర్తి లింగన్న,సంపత్, నగరబజరంగ్దళ్ సంయోజక్ దిగంబర్ సహసంయోజక్ అరవింద్, ఆరెల్లి జలంధర్, చక్రపాణి, బాలు,అనిల్,కిరణ్, సురేష్, కార్తీక్, దుబాసి తిరుపతి, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 05, 2024 | 0 Comments

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడుపుకోవాలి పోత్కపల్లి ఎస్ఐ దికొండ రమేష్

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడుపుకోవాలి పోత్కపల్లి ఎస్ఐ దికొండ రమేష్ జనం గొంతు /ఓదెల/ సతీష్ కుమార్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు మీకోసం లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు.. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు మీకోసం కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు 18 సంవత్సరాలు పైబడిన వాళ్లే ఆటో నడపాలని నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడపాలన్నారు. 1)ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి 2)మద్యం తాగి ఆటో నడపరాదు 3)ఆటో పేపర్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి 4)ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదు 5)రోడ్లమీద ఆటోలో నిల్ప రాదు. 6) ఆటోలో అనుమాన వ్యక్తులు ప్రయాణం చేసిన యెడల పోలీసులకు తెలియజేయాలి 7) ఆటోలో మ్యూజిక్ సిస్టం పెట్టరాదు 8) మహిళల ప్రయాణికుల పట్ల వృద్దుల పట్ల గౌరవం చూపెట్టాలి, 9) పోలీసు స్టేషను లో ప్రతి ఒక్క ఆటోకు టాప్ నెంబర్ ను . తప్పకుండా ఆటో యజమానులు తమ ఆటోలకు టాప్ నెంబర్ ను వేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి ఆటోలు నడిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది పోత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు తెలిపారు. అనంతరం వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న డ్రైవర్ ఆనంద్ ను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు..

By NYALAKONDA ANIL DESAI | December 28, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1