|
modi add 1

రానున్న తరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం. - రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్.

జనంగొంతు/గోదావరిఖని/అంబటి సతీష్ / గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు,ఈ మీడియా సమావేశంలో గత ప్రభుత్వం రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చి నిరుద్యోగాన్ని మరింతగా పెంచారని, ఇక్కడి పరిశ్రమలు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే నిధులను పక్క నియోజకవర్గాలకు తరలించడం జరిగిందని ఆయన అన్నారు. శాసనసభ్యుడుగా ఇక్కడి ప్రజలు నన్ను గెలిపించినందుకు వారి సేవ చేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని,అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తాను ప్రత్యేక శ్రద్ధ వహించి రానున్న తరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం అని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. రామగుండానికి 29 కోట్లతో ఆర్ అండ్ బి నిధులు కేటాయించామని, 10 కోట్లతో DMFT,10 కోట్లతో ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్స్,సింగరేణి సంబంధిత ప్రాంతాల్లో సింగరేణి వారి సహకారంతో రోడ్లు డ్రైనేజీలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు, మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 20, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1