|
modi add 1

ఘనంగా స్వామి వివేకానంద జయంతి

ఘనంగా స్వామి వివేకానంద జయంతి రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ప్రసంగాలు యువకుల్లో చైతన్యం నింపుతాయి. అందుకే ఆయన జయంతి రోజైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డే నిర్వహించాలని 1984లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. 1985 నుంచి ఏటా వివేకానందుడి ఆదర్శాలు కొనసాగేలా యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. జనవరి 12వ రోజును యువ దివస్ అని కూడా పిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు కొమ్ముల ఆది రెడ్డి, జెడ్ సి కాటిపెల్లి రామ్ రెడ్డి, డిసి బత్తిని భూమయ్య, కోశాధికారి గంట్యాల ప్రవీణ్, లయన్స్ సభ్యులు ఎద్దండి దివాకర్, కొత్తపెల్లి రంజిత్, వాసం ప్రసాద్ పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | January 12, 2024 | 0 Comments

హిందూ ధర్మ పరిరక్షణే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయం...

హిందూ ధర్మ పరిరక్షణే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయం... జిల్లా సహ శారీరక్ ప్రముఖ్ నూతికట్ల సత్యం... రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి హిందూ ధర్మ పరిరక్షణే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయమని జిల్లా సహ శారీరక్ ప్రముఖ్ నూతికట్ల సత్యం అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి ఉత్సవము, వివేకానంద జయంతి లలో ప్రధాన వక్త గా పాల్గొని ఆయన మాట్లాడుతూ సంక్రాంతి ప్రకృతిలో వచ్చే మార్పుల ఆధారంగా సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశి లో ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగ అని అన్నారు. హిందూ పండుగల్లో సామాజిక సమరత, ఐక్యత, సనాతన ధర్మ ఆచరణలు ఇమిడి వున్నాయని అన్నారు. సంఘం నిత్యశాఖ ద్వారా వ్యక్తినిర్మాణం చేస్తుందని, జాతీయ భావన, దేశభక్తి, సమర్పణ, త్యాగ భావాలను, ధైర్యాన్ని, మానసిక, శారీరక ధారుఢ్యాలను వికసింప జేస్తుందని, శాఖ మనోవిజ్ఞాన కేంద్రం గా పని చేస్తుందని అన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను సంఘం ఆచరిస్తుందని, యువత వివేకానంద ఆశయాలను స్ఫూర్తి గా తీసుకొని ఆదర్శవంతమైన శక్తివంతమైన యువశక్తి గా ఎదిగి దేశహితం కోసం లో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ నెల-22 న అయోధ్య లో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠతో 500 వందల సంవత్సరాల నుండి పోరాట చేసిన కోట్లాదిమంది హిందువుల కళ సాకరమవుతుందని, ఆ రోజున హిందువులందరు తమతమ నగరాల్లో, గ్రామాల్లో గల దేవాలయాలను దర్శించుకుని ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని టీవీల్లో తిలకించాలని, ఆ రోజు రాత్రి ప్రతీ ఇంటిలో ఐదు దీపాలు వెలిగించాలని, రెండు దీపాలు ఇంటి లో దేవుని వద్ద, రెండు దీపాలు ఇంటి ముఖ ద్వారం వద్ద, ఒకటి తులసీ మాత వద్ద వెలిగించాలని, ఐదు దీపాలు ఐదు వందల సంవత్సరాల పోరాట విజయానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ్ వేల్పుల స్వామి యాదవ్, కుర్మ మల్లారెడ్డి, దొంగ జితేందర్, సురేందర్, సుంకిశాల సత్యం, బయ్యని అంజి, లోకిని స్వామి, రొట్టె శ్రీధర్, గజ్బిన్కర్ కిరణ్, మహేష్, నవనీత్, పవన్, జశ్వంత్, శ్రీకర్, శ్రీమాన్, అభిరాం తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | January 12, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1