రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా జగదీశ్వర్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఇక్కడ కమిషనర్ గా విధులు నిర్వహించిన గంగుల సంతోష్ బదిలీ కాగా, మెట్ పల్లి కమిషనర్ గా విధులు నిర్వహించిన జగదీశ్వర్ గౌడ్ బదిలీ పై రాయికల్ పట్టణానికి వచ్చారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన జగదీశ్వర్ గౌడ్ ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.