|
modi add 1

ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో అడవిలో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం

రాయికల్ మండలంలోని ప్రజా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చింతకుంట సాయికుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తూ కోతులు జనంలోకి వస్తు,ఆకలి తో అలమటిస్తు,అడవిలో ఉండాల్సిన జంతువులు జనంలోకి రావడంతో వాటితోపాటు ప్రజలు ఇబ్బందుల పాలు అవుతున్నారు.కాగా కాశ్మీర్ ఆపిల్,అల్ల నేరేడు,తేవాన్ జామ,బత్తాయి, సపోటా, తదితర పండ్ల మొక్కల విత్తనాలతో పిడకలు,కొబ్బరి పీచు,మట్టి మిశ్రమాలు కలిపి సీడ్ బాల్స్ ని తయారు చేయగా,వాటిని కట్కా పూర్,తాట్లవాయి పరిధిలో గల వెన్ను ముద్దల గండి,అటవీ ప్రాంతంలో వెదజల్లే కార్యక్రమం చేపట్టారు.ఇట్టి సందర్భంగా రాయికల్ ప్రెస్ క్లబ్ (జేఏసీ) అధ్యక్షులు వాసరి రవి,ప్రధాన కార్యదర్శి కడ కుంట్ల జగదీశ్వర్ మాట్లాడుతూ కోతుల మరియు ఇతర జంతు జీవజాలం వనంలో పండ్లు దొరకక ఆకలితో అలమటిస్తూ, జన వాసాల గృహాల రైతుల పంటలపై దాడులు చేస్తూ రైతులకు ప్రజలకు నష్టం కలిగిస్తున్న సందర్భంగా పాటు అవి ఆకలితో అలమటిస్తుండడం చూసి ఆవేదన కలిగిందని అతి తక్కువ సమయంలో పెరిగి పండ్లు ఇచ్చే పండ్ల మొక్కల విత్తనాలను ప్రముఖ విత్తనాలను తెప్పించి వాటితో సీడ్ బాల్స్ ను తయారు చేసి అడవిలో గుట్ట పై వెదజల్లుతూ చేపట్టిన కార్యక్రమం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతకుంట సాయికుమార్, ఇమ్మడి విజయ్ కుమార్, యాచమనెనీ కిరణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 03, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1