గోదావరిఖని/జనంగొంతు/అంబటి సతీష్ / రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి ఎన్నికైన మీరు క్రమశిక్షణ తో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని ట్రైనీ కానిస్టేబుళ్ళకు పోలీస్ కమిషనర్ సూచించారు. పోలీస్ కానిస్టేబుళ్ళ నియామకంలో భాగంగా స్టయిఫండరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ళగా ఎంపికై తొమ్మిది నెలల శిక్షణకు వెళ్ళుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లతో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపిఎస్ మాట్లాడడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుళ్ళ నియామాకాల్లో సివిల్ కానిస్టేబుళ్లు పురుషులు మొత్తం 150 శిక్షణా కేంద్రం ఖమ్మం, ఆర్ముడ్ కానిస్టేబుళ్లు పురుషులు మొత్తం 110 శిక్షణా కేంద్రం వికారాబాద్, AR మహిళా కానిస్టేబుళ్లు మొత్తం 35 శిక్షణా కేంద్రం,మేడ్చల్, సివిల్ మహిళా 86 శిక్షణా కేంద్రం TSPA, హైదరాబాద్ లో తొమ్మిది నెలల శిక్షణ అందజేయబడుతుందని. నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలకు సేవలందించే రీతిలో ట్రైనీ కానిస్టేబుళ్ళకు శిక్షణ సమయంలో మానసికంగా, శారీరకంగా, అలాగే వివిధ అంశాలపై అవగాహన కల్పించే తరహలో శిక్షణ అందజేయబడుతుందని. మీరు ఎలాంటి పరిస్థితులోనైనా విజయంగా సాధించే తరహలో శిక్షణ అందించబడుతుందని, మీరూ పొందే శిక్షణతో మీరు పదవీవిరమణ పోందే వరకు ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కోనే పోలీస్ అధికారిగా రూపాంతరం చెందుతారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండి సేవా చేసే అవకాశం ఒక్క పోలీస్ శాఖ కి మాత్రమే ఉంటుంది అన్నారు. పోలీస్ ఉద్యోగం సాధించిన మీకు సమాజం లో, కుటుంబంలో మంచి మర్యాద, గౌరవం, గుర్తింపు లభిస్తుంది అన్నారు.
గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పిడియస్ బియ్యన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిని టాస్క్ ఫోర్సు సిబ్బంది శ్రీనివాస్, ప్రకాష్,అఖిల్లోద్దీన్, మల్లేష్ లు కలిసి కళ్యణ్ నగర్ వద్ద తనిఖీ నిర్వహించి AP 15TA 1957 టాటా ACE ట్రాలీ ను ఆపి తనిఖీ చేయగా బ్యాగ్ లలో నింపి ఉన్న పిడియస్ రైస్ సుమారు 25 క్వింటాళ్ల గుర్తించి వాటిని స్వాధీన పరుచుకొని ట్రాలీ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించినట్లు, నిందితుల వివరాలు 1) చింతల రాజేందర్ s/o పుల్లయ్య, 30 yrs , బుడిగె జంగం, ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల. 2) చిప్పకుర్తి ప్రవీణ్ s/o లింగయ్య, మాది 22 yrs, ఎన్టీఆర్ నగర్, మంచిర్యాలగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
గురువారం సాయంత్రం 4.00 గంటలకు జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్, IPS గారి ఆదేశాల మేరకు , జగిత్యాల డీఎస్పీ శ్రీ రఘు చందర్ గారి పర్యవేక్షణ లో, రూరల్ సిఐ శ్రీ ఆరిఫ్ అలీ ఖాన్ గారు మరియు రాయికల్ ఎస్సై అజయ్ మరియు వారి సిబ్బంది రాయికల్ శివారు లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు CCL, A-1 కొండూరి రాజేష్ మరియు A-2అరుముల్ల సాయి లు స్కూటీ పైన రాయికల్ వైపు జగిత్యాల నుండి వస్తుండగా, కుమ్మరిపల్లి బస్టాండ్ వద్ద వారిని పట్టుకొని విచారించగా వారి వద్ద గల సంచి లో 1.5 కిలోల ఎండు గంజాయి ఉన్నది. నిందుతుల వద్ద నుండి గంజాయి, సెల్ ఫోన్ లు మరియు స్కూటి ని స్వాధీన పరచుకొని విచారించగా వారు చేసిన నేరం ఒప్పుకున్నారని ప్రెస్ మీట్ లో తెలియజేశారు.
సుల్తానాబాద్, జూలై 14 (జనం గొంతు) : సుల్తానాబాద్ పట్టణంలో 271 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు. పట్టణంలోని పూసాల రోడ్డులో ఎస్సై శ్రావణ్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు నిర్వహిస్తుండగా పూసాల నుండి సుల్తానాబాద్ వైపు స్కూటీపై వస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో,ఆపి చెక్ చేయగా స్కూటీలో గంజాయి లభించింది. పంచాయతీ సెక్రటరీలు ప్రమోద్ కుమార్, పాపయ్య లు ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి, విచారించగా నిందితుడు చంద్రపూర్ నుండి గంజాయి విక్రయించి తీసుకొచ్చి సుల్తానాబాద్ లో సప్లై చేస్తున్నట్టుగా అంగీకరించాడని, అతని వద్ద రైల్వే టికెట్ బస్సు టికెట్ మొబైల్ ఫోను బైక్ 271 గ్రాముల గంజాయి లభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.