|
modi add 1

నిమ్న వర్గాలు ఎవరూ అధైర్య పడవద్దు జాతీయ ఎస్సీ కమీషన్ సబ్యులు రాంచందర్

అణగారిన వర్గాల ప్రజలమని సమాజంలో ఇంకా అట్టడుగున నే ఉన్నామని ఎవరూ అధైర్య పడవద్దు అని జాతీయ ఎస్సీ కమీషన్ సబ్యులు రాంచందర్ అన్నారు. శుక్రవారం ఆయన ఆప్త మిత్రులు అయిన రాష్ట్ర భిఎంఎస్ అద్యక్షులు కలాల్ శ్రీనివాస్ ఇంటిలో ఆతిథ్యం స్వీకరించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. అణగారిన వర్గాలయిన ఎస్సీ,ఎస్టీ కులాలు ఎవరూ కూడా అధైర్య పడవద్దు అని సమాజంలో అందరూ సమానమేనని తెలిపారు. అందుకు అనుగుణంగా భారత రాజ్యాంగం రాయబడిందని అన్నారు. ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలయిన ఎస్సీ ఎస్టీ కులాలు కోసం అనేక హక్కుల ను రాజ్యాంగం ద్వారా సంక్రమింప చేశారని తెలిపారు. అందుకు మోడి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని అందుకే తనను జాతీయ ఎస్సీ కమీషన్ సబ్యులు గా నామినేట్ చేసారని అన్నారు. [8:22 pm, 15/03/2024] Nyalakonda Anil Desai: అణగారిన వర్గాల ప్రజలకు ఎక్కడ ఏ ప్రాంతం లో అయినా అణచివేత కు అవమానానికి గురైనట్లు బావించితే ఎస్సీ కమీషన్ ను సంప్రదించాలని అందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని మీ సమస్యను ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తే సరిపోతుంది అని అన్నారు. ఈ కమీషన్ ద్వారా తనకు జ్యుడీషియల్ పవర్ ఉంటుందని అధికారంలో ఎంత పెద్ద వారున్నా క్షణాల్లో అరెస్టు చేయించగలిగే అధికారాలు తనకు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కలాల్ శ్రీనివాస్ తో పాటు సిద్దిపేట కు చెందిన బి ఎంఎస్ నాయకులు కొండాల్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,ఆర్చ్ ఫార్మా కార్మికులు ఇతర బి ఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 16, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1