రాయికల్ మండలంలోని లోక్య నాయక్ తండాలో బంజారా సాంప్రదాయమైన తీజ్ పండగను ఘనంగా నిర్వహించారు.ఈ పండగను పెళ్లి కానీ ఆడపడుచులు 9 రోజులు గోధుమలను నానబెట్టి నీరు పోస్తూ ఉపవాసంతో కొలిచి తొమ్మిది రోజుల తర్వాత నారు మొలిచినాక చెరువులో నిమర్జనం చేస్తారు.దీని ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండి ఉన్నత స్థాయికి ఎదిగి మంచి భర్తను పొందాలని పెళ్లి కానీ ఆడపిల్లలు కొలుస్తారు వారి యొక్క ప్రత్యేకమైన పండగ ఈ యొక్క ఉత్సవములో తండా నాయక్ భూక్య అర్జున్ నాయక్ ,కార్భారీ ,లావుడియా ,కెవుడియ నాయక్, డావ్ అజ్మీర, మంగ్యా నాయక్ తండ మాజీ సర్పంచ్ భూక్య బంగారి ,నునావత్ రాజు నాయక్, మాలవత్ రాజు నాయక్ ,భూక్య మురళి నాయక్ , నునావత్ బలరాం నాయక్, కెతావత్ దేవుల నాయక్ , రవి నాయక్ ,రతిలాల్ నాయక్ ,రాజేందర్ నాయక్ ,చందు నాయక్ ,తిరుపతి నాయక్ గంగాధర్ నాయక్ ,రమేష్ నాయక్ ,తదితర తండా పెద్దమనుషులు మహిళలు యువకులు కలిసి ఘనంగా పండగ వేడుకను జరిపారు.
Your experience on this site will be improved by allowing cookies.