|
modi add 1

తెలంగాణ వ్యాప్తంగా అనిల్ సెక్యూరిటీ సంస్థ లో సెక్యూరిటీ ఉద్యోగాలు

కరీంనగర్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ కి సెక్యూరిటీ గార్డులు కావలెను. జీతం 12100/- ఈఎస్ ఐ, ఈపీఎఫ్ అదనం. కరీంనగర్ కు స్థానిక రాకపోకలకు అనుకూలమైన వారు సంప్రదించండి 9666877880 6300661014 2) మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ హైవే మీద గల సర్వీస్ సెంటర్ లో సెక్యూరిటీ సిబ్బంది కావలెను. జీతం 11000 ఈఎస్ఐ ఈపిఎఫ్ అదనం సంప్రదించండి 6300661014 3) మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఫార్మా కంపెనీలకు సెక్యూరిటీ గార్డులు కావలెను. జీతం 13000/- ఉచిత వసతి భోజనం సౌకర్యం ఉంటుంది. ఈఎస్ఐ ఈపీఎఫ్ అదనం జడ్చర్ల నుండి 40 కి.మి. అవతలి వారు అర్హులు. సంప్రదించండి 6300661014 4) హైదరాబాద్ నుండి విజయవాడ రూట్ చౌటుప్పల్ కు 13 కి.మి. దూరంలో గల సైట్ లో సెక్యూరిటీ గార్డులు కావలెను. జీతం 16000/- ఉచిత వసతి మాత్రం ఉంది భోజనం లేదు. చుట్టూ ఎత్తైన గుట్టలు ఉండడం వల్ల సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం హైమాస్ లైటింగ్ వ్యవస్థ విద్యుత్ ఫెన్సింగ్ సి కెమెరా లు ఉంటాయి ఇబ్బంది లేదు. 6300661014

By NYALAKONDA ANIL DESAI | October 27, 2023 | 2 Comments

తెలంగాణా రాజకీయాల్లో ఏం జరగబోతోంది.

తెలంగాణ లో జరగబోయే ఎన్నికలతో రాజకీయ వర్గాల్లో అనేక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, బిజేపి, కాంగ్రెస్ లు ఎవరికి వారే అదికారం మాదే అనే ఆలోచనలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తిరిగి మరింత అదనంగా జోడించి కొనసాగిస్తాం అంటూ బిఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుండగా. సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ గా సామాజిక భద్రత అవసరం. వ్యక్తిని బలోపేతం చేస్తే సమాజం ఆర్దికంగా నిలబడుతుందంటూ బిజేపి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అంత నిగూడమైన లోతుల్లోకి వెల్లి అర్థం చేసుకునే మనస్తత్వం సామాన్య ఓటరుకు ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అడుగంటిపోయిన తన ప్రాభవాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనలతో దూకుడు ప్రదర్షిస్తోంది. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణా ఆర్థిక స్తోమత కు మించి హామీలను గుప్పిస్తోంది. పనిలోపనిగా కాంగ్రెస్ కు మొదటినుండి వెన్నుదన్నుగా నిలబడిన క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ కు మాత్రమే పడేలా కార్యాచరణ రూపొందించుకుంటోంది. తద్వారా కర్ణాటక లో మాదిరిగా తెలంగాణ లో కూడా అదికారం అంది పుచ్చుకోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ అదిష్టానం ఉంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ అదికారం లోకి వచ్చినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అదికారం లోకి రాకపోతే కాంగ్రెస్ పేరుతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది కాంగ్రెస్ నీడన ఉంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా బిజెపి ని హిందుత్వ పార్టీగా మైనారిటీలకు సూచికగా చూపించి వేసిన ఓట్ల గేలంతో అదికారం అందిపుచ్చుకున్న కాంగ్రెస్ కు తెలంగాణా లో కూడా అదే ఫార్ములా ప్రయోగిస్తే ఇక్కడి సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పాచికలో చిక్కుతారా లేక కాంగ్రెస్ కే ఝలక్ ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే బిఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు సామాన్యులకు మేలు చేకూర్చినప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి దౌర్జన్య పూరిత వ్యవహారాల మూలంగా కేసిఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ వారి ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహారాల మూలంగా సామాన్య ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది చాలా వరకు కేసిఆర్ అండ్ టీమ్ మీద వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. ఇక బిజెపి విషయానికి వస్తే అదికారం అందుకునే దాకా అని పైకి లేచిన బిజేపి గాలి అంతే వేగంగా కిందికి పడిపోయింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పైకి లేచిన ప్రాభవాన్ని నిలబెట్టుకోవడంలో తెలంగాణ నేతలు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే కేంద్ర సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి రహిత కేంద్ర పాలన. దేశ భద్రత అంశాల్లో గత పాలకులకు కేంద్రం లో అదికారం లొ ఉన్న బిజెపి ప్రభుత్వానికి గల తేడా. సామాన్యుడిని కూడా ఆర్దికంగా తనంతట తానుగా ఆర్దికంగా నిలదొక్కుకునేలా అనుసరిస్తున్న కేంద్ర విదానాలు. హిందుత్వ కార్డు తమను గట్టెక్కిస్తాయని అనుకుంటున్నారు. రేపటి గురించి ఆలోచించి బుర్ర పాడు పాడుచేసుకోవడం ఎందుకు ఈరోజు మాత్రం చాలు అంటూ తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే చూడగలిగే సామాన్య ఓటరుకు ఇవన్నీ అర్దమవుతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో...

By NYALAKONDA ANIL DESAI | October 28, 2023 | 0 Comments

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ పిలుపు సమ్మె వాల్ పోస్టర్ విడుదల ఏటూరునాగారం,జనం గొంతు, జయరాజు కేంద్ర బిజెపి కార్మిక ప్రజావ్య తిరేక విధా నాలను తిట్టుకో డందాం కార్పొరేట్ అనుకూల మతత త్వ విధానాలను ప్రతిఘ టిస్తూ ప్రభుత్వంగాన్ని కాపా డుకుందాం అనే నినా దంతో ఫిబ్రవరి 16 దేశవ్యా ప్తంగా జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు ఐఎన్ టి యుసి ఏఐటియుసి సిఐటి యు, హెచ్ఎంఎస్,3 ఐ ఎఫ్ టి యు లు, బి ఆర్ టి యు, టి ఎన్ టి యు సి,ఏ వీటితో పాటు ఉద్యోగ సంఘాల ఆల్ ఇండియా ఫెడరేషన్లు, స్కీం వర్కర్ల ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సంఘా లన్నీ ఈ సమ్మెకు పిలుపుని చ్చాయని సిఐటి యు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ అన్నారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో కి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ సంవత్స రానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక మైన రైల్వే రోడ్లు గ్యాస్ ఓడరేవు లాంటి వాటి ఆస్తులను ప్రైవేటు వారికి కట్టబెట్టి లక్షల కోట్లు కట్టబెట్టాలని చూసిందన్నారు అందుచేతనే ఉద్యోగ కార్మిక రైతు బ్యాంకింగ్ అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతుతో ఈ యొక్క సమ్మె జరుగుతుం దన్నారు.కనీస వేతనం 26000 చెల్లించాలి స్కీము లకు బడ్జెట్ పెంచాలి నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, ప్రభుత్వం రంగ సంస్థలు అమ్మడం ప్రైవేట్ పరం చేయడం ఆపాలి కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ధరల పెరుగుదలను అరికట్టాలి, ఆహార వస్తువుల నిత్యవస రాలపై జిఎస్టి ఉపసంహరిం చుకోవాలనే డిమాండ్స్ తో ఈ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల ని కోరారు.ఈ యొక్క కార్య క్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు బాలోజు రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిటమట రమేష్,కార్మికులు ఎం పెళ్లి మురళి,నాయిని కృష్ణ,గోగు మల్లయ్య,డి. చిన్న,వి కృష్ణ,వి ఎల్లయ్య,డి రాంబాబు,వి సుధాకర్,వెంకన్న జిపి కార్మికుడు,జే సమ్మయ్య,రిక్షా కార్మికులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 15, 2024 | 0 Comments

నూతన ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్

జనంగొంతు,మంగపేట, జయరాజు మంగపేట మండలం కస్తూరి బాయి వృద్దాశ్రమంకు ప్రజా సేవ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వ ర్యంలో 25 కేజీ బియ్యం, పండ్లు,స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడు తూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనాతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నా రు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి, గౌరవ సలహాదరులు గుండేటి రాజు యాదవ్,చల్లగురుగుల తిరుపతి,సాధనపల్లి కరివర్ధన్,గౌని రమేష్,పిల్లల మర్రి వేణు,ముప్పారాపు సందీప్,మూగల రాము, సాయి,తదితరులు పాలుగోన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 16, 2024 | 0 Comments

ప్రధానమంత్రి జీవనజ్యోతి ఆధ్వర్యంలో 2 లక్షల చెక్కు పంపిణి

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండల్ రామాజీపేట గ్రామానికి చెందిన బండి రాధ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులైన బండి శ్రీనివాస్ కి ప్రధానమంత్రి జీవనజ్యోతి ఆధ్వర్యంలో 2 లక్షల చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎం ఆనందరావు బ్రాంచ్ మేనేజర్ పవన్ కుమార్ వి ఎల్ ఈ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.

By NYALAKONDA ANIL DESAI | February 17, 2024 | 0 Comments

రాయికల్ లో ఘనంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలు

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు చంద్రశేఖర రావునీ తెలంగాణ ప్రజలు ఎన్నడు మర్చిపోరు మరియు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 4 వ వార్డు కౌన్సిలర్ తురుగా శ్రీధర్ రెడ్డి, 5 వ వార్డు కౌన్సిలర్ వల్ల కొండ మహేష్ బిఆర్ఎస్ నాయకులు పటేల్ శివ , రావిన్, వంశీకృష్ణ, సూర్య, వినోద్, శివ, రవితేజ, ఇతరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 17, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1