రాయికల్ //జనం గొంతు : రాయికల్ గుడేటి రెడ్డి సంఘ భవనంలో గురువారం రోజు జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం గుడేటిరెడ్డి సంఘ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది. తదనంతరం సంఘ భవనానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరగా ఎమ్మెల్యే గారు దీనికి సానుకూలంగా స్పందించారు. అలాగే రాయికల్ అల్లూరి సీతారామరాజు బొమ్మ నుండి మార్కెట్ యార్డ్ వరకు విద్యుత్ దీపాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని స్పందించారు. ఇట్టి కార్యక్రమంలో గుడేటిరెడ్డి సంఘం అధ్యక్షుడు కాకరి రాజేందర్ రెడ్డి,కోశాధికారి వెలమ నరేందర్ రెడ్డి,ఏనుగు మల్లారెడ్డి ,బద్దం సంజీవరెడ్డి, సింగిరెడ్డి రాజేందర్,నూతల దేవేందర్, ఎలేటి తిరుపతిరెడ్డి, ఎడమల రాజు రెడ్డి,సురకంటి రాజారెడ్డి,బద్దం రవీందర్మరియు సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.