|
modi add 1

గురుకుల మెరిట్ అభ్యర్థుల భారీ ధర్నా

గురుకుల మెరిట్ అభ్యర్థుల భారీ ధర్నా Samala kiran హైదరాబాద్: స్థానిక ఇందిరా పార్క్ వద్ద గురుకుల మెరిట్ అభ్యర్థుల ధర్నా గురువారం నాడు జరిగింది. ఇటీవల ప్రభుత్వం గురుకుల నియామక పత్రాలు అందజేసింది. ఈ నియామకాల్లో అనేక మంది అభ్యర్థులు పలు పోస్టులకు ఎంపిక అయ్యారు. అట్లాంటి అభ్యర్థుల నుండి ఒకే పోస్ట్ లో నియామకం తీసుకొని మిగతా పోస్టులకు తర్వాత మెరిట్ అభ్యర్థులను తీసుకోవాలి. గురుకుల నియామకాల్లో అవరోహణ క్రమం పాటించాలని మరియు Relinquishment తీసుకునే విషయం పై నియామక బోర్డు, ప్రభుత్వంవెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థులు ధర్నా సందర్భంగా డిమాండ్ చేశారు. ఇలా చేయటం వలన వేలాది మంది కి ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని. దీనిపైన సకాలంలో స్పందించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థులు కోరారు. కాగా ధర్నాకు మద్దతుగా బిసి ఉద్యమ నేత కృష్ణయ్య మద్దతుగా నిలిచారు.

By NYALAKONDA ANIL DESAI | March 08, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1