గుడికోటలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు... అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయికల్ పట్టణం లోని గుడికోట లో శివరాత్రి జాగరణలో భాగంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన శివతాండవం, భారత నాట్యం, మిమిక్రీ భక్తులను అమితాంగ ఆకట్టుకుంది. వేలాదిమంది భక్తులు తరలివచ్చి శివరాత్రి జాగరణలో పాల్గొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో రాయికలోని బాలికల ప్రభుత్య పాఠశాల,కృష్ణ వేణి టాలెంట్ స్కూల్, వివేకవర్ధిని హైస్కూల్, విశ్వశాంతి హైస్కూల్, గ్రీన్ వుడ్ విద్యార్థులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.