|
modi add 1

సమస్యల వలయంలో ప్రభుత్వ ఆసుపత్రి

* బాత్రూమ్లలో నీరు రాక రోగుల ఇబ్బంది * జ్వరం ఉందని ఆసుపత్రికి వెళ్తే చర్మ వ్యాధితో రోగి * నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న ఆసుపత్రి సిబ్బంది సుల్తానాబాద్,జూలై -4 (జనం గొంతు): గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుల్తానాబాద్ సర్కారు దవాఖాన సమస్యల వలయంలో కూరుకుపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు వైద్యం కోసం సర్కారు దవాఖానకు వస్తే సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రోజుల నుండి బాత్రూంలలో లైట్లు లేకపోవడం నీరు రాక పోవటంతో ఇబ్బందులు పడుతున్న రోగులు. రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన బండి అశోక్ జ్వరంతో మూడు రోజుల క్రింద సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ కాగా, ట్రీట్మెంట్ నడుస్తుండగా ఇన్ఫెక్షన్ కారణంగా చర్మంపై దద్దుర్లు,బొగ్గలతో కూడిన ఇన్ఫెక్షన్ రావడంతో రోగి సంబంధీకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా బండి అశోక్, రోగి సంబంధీకులు రాకేష్ లు మాట్లాడుతూ, జ్వరంతో ఆస్పత్రిలో వైద్యం నిమిత్తం మూడు రోజుల క్రింద అడ్మిట్ అయ్యానని, డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ కారణంగానే చర్మంపై నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ, డెర్మటాలజిస్ట్ ను సంప్రదించమని చెప్తున్నారని అన్నారు.రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన రోగి సంబంధికులు రమేష్ మాట్లాడుతూ, గత నాలుగు రోజుల కింద మా అమ్మను జ్వరం రావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశానని, ఈ ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగా లేక, బాత్రూంలలో నాలుగు రోజులుగా లైట్లు లేక,నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని,ఈ విషయమై ఆసుపత్రి సూపర్వైజర్ ను సంప్రదిస్తే, నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తూ, మాకు బిల్లులు రావడం లేదని దబాయిస్తున్నారని, బాత్రూంలో శుభ్రపరచడం లేదని, వాటి నుండి వచ్చే దుర్గంధం వల్ల చాలా ఇబ్బందికి గురవ్వుతున్నామని అన్నారు. జబ్బులు తగ్గడానికి ఆసుపత్రిలో చేరితే, మరింత ఎక్కువ అయ్యేలా ఉన్నాయని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డ్యూటీ డాక్టర్ సునీతని సంప్రదించగా రోగికి ట్రీట్మెంట్ చేస్తున్నామని ఏదైనా జబ్బు వస్తే, నయమవ్వడానికి సమయం తీసుకుంటుందని గమనించాలని అన్నారు.

By NYALAKONDA ANIL DESAI | July 04, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1