జమాతి ఇస్లామిక్ హింద్ స్టూడెంట్ వింగ్ గర్ల్స్ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత,పాఠశాల విశ్వశాంతి ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులంతా రాబోయే బోర్డు పరీక్షల్లో మంచి గ్రేడింగ్ సాధించాలని, యోగ, ధ్యానం ప్రతిరోజు చేయాలని, మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ రాయికల్ అధ్యక్షులు ఎం.డి . షంషేర్ ఉల్ హాక్ , సభ్యులు ఎం.డి. అబ్దుల్ నయీమ్ ,ఎం.డి.మజహర్ జి.ఐ.ఓ. సభ్యులు తుబా ఫాతిమా , సానియా ముస్కాన్ , రింశ ఫాతిమా పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.