త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం!! పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను భుజాలపైన మోస్తాం!! పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి!! భోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గం ప్రమాణస్వీకారం సభలో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క తెలంగాణలో రైతులని రాజులను చేసే ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతు రుణ విముక్తి దారుణ చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముందున్న ప్రధాన లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, శ్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు సీతక్క పేర్కొన్నారు స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బోత్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం లో పాల్గొని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శాలువాలతో సన్మానించారు ముందుగా ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు నూతన పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు లభిస్తోందని, దానికి నిదర్శనమే బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి అని పేర్కొన్నారు ప్రజల్లో ఉండండి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బోజ్జు నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గం అనునిత్యం రైతాంగ సమస్యల మీద, రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా దళారులు నష్టపరచకుండా రైతులందరికీ అందుబాటులో ఉండాలని, పార్టీలో కూడా క్రియాశీలకంగా ప్రజల్లో పనిచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆర్ గ్యారంటీలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి కష్టపడి పని చేయాలని సూచించారు సీతక్క నోట భోథ్ రెవెన్యూ డివిజన్ మాట రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త సమస్యలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని రానున్న కేబినెట్ మీటింగ్లో బోథ్ రెవెన్యూ డివిజన్, సోనాల మండల ఏర్పాటు, ఫైర్ స్టేషన్, డిగ్రీ కళాశాల ఇన్చార్జి మంత్రిగా కేబినెట్ ముందు ఉంచుతానని భరోసా ఇచ్చారు బిఆర్ఎస్ బిజెపిలో ఒకే తాను గుడ్డలని నూతన వ్యవసాయ చట్టాలు అమలు చేస్తూ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వారి పార్టీలో వ్యక్తిగత జీవితం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ప్రజా సమస్యల మీద చూపించాలని బిఆర్ఎస్ బిజెపి నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం, భోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ అడ్డీ బోజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లీ శ్రీధర్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రపూల్ రెడ్డి, మహమూద్ ఖాన్, తలమడుగు మండల ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, జడ్పిటిసి సభ్యులు మల్లెపూల నరసయ్య, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ యూత్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఫిషరీస్ , భోథ్ నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు రైతులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా రైతు నేస్తం కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. కరువొచ్చినా, కష్టమొచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలను అనుసంధానం చేస్తూ వినూత్నంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం తన నివాసం నుంచి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్ శ్రీ రఘునందనరావు, డైరెక్టర్ శ్రీ గోపి, రైతు సంఘాల ప్రతినిధులు శ్రీ సుంకెట అన్వేష్ రెడ్డి, శ్రీ నల్లమల వెంకటేశ్వర రావు, శ్రీ వై వెంకటేశ్వరరావు సచివాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పలువురు రైతులు ఇందులో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ విధానంతో అనుసంధానం చేసే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా తొలి విడత 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను నెలకొల్పింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రూ. 97 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర అధికారులతో పాటు వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకోవడానికి ఈ సదుపాయం వీలుకల్పిస్తుంది. పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు వ్యవసాయ రంగంలో అధునాతన మెలకువలను వారికి అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాలుపంచుకున్నారు. ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలిచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నేరుగా రైతులు వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలని, అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో ఎదురవుతున్న కరవు పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కోవలసిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉందని, కేవలం వరి లేదా పత్తి, మిర్చీ పంటలకే పరిమితం కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని, పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని, రైతులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటుందని అన్నారు. రైతులు ధీమాగా బతికేందుకు రైతు బీమా పథకంతో పాటు పంటల బీమా పని చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.