పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క. ఉట్నూర్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు గొప్ప లక్ష్యాలను పెట్టుకొని ఆ దిశగా ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు సైతం అన్ని రంగాలు రాణించాలని పేర్కొన్నారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన చదువును మధ్యలో ఆపేయకుండా అన్ని అవరోధాలను దాటుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్,మే 2 (జనం గొంతు ):విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రేగడి మద్దికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాధాస్వామి, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి అన్నారు.సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ఆదేశాల మేరకు పి ఈ టి దాసరి రమేష్ ఆధ్వర్యంలో వేసవికాల టెన్నికాయిట్ క్రీడా శిబిరమును పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాస్వామి, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు, క్రీడల్లో పాల్గొని మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరిక ధారుఢ్యనికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల ఎస్ జి ఎఫ్ కన్వీనర్ ప్రణయ్, టెన్నికాయిట్ జాతీయ క్రీడాకారుడు బలరాం, రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ సెక్రెటరీ, అల్లిపూర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ లలిత, సతీష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.