|
modi add 1

కాంగ్రెస్ పార్టీ వి వంశపారంపర్య రాజకీయాలు మాత్రమే

వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ గారికి కుటుంబం లేదంటూ విమర్శలు చేస్తున్నాయని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ, వారసత్వ, అవినీతిని ఎండగడుతున్నందుకే మోదీ గారికి కుటుంబం లేదని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు కుటుంబమే ఫస్ట్ అని పనిచేస్తుంటే... మోదీ గారు మాత్రం నేషన్ ఫస్ట్ నినాదంతో పని చేస్తున్నారన్నారు. 140కోట్ల దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులని మోదీజీ భావిస్తారని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మోదీకి బ్రహ్మరథం పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు. మేరా భారత్‌ - మేరా పరివార్‌ అనే భావనతోనే మోదీజీ జీవిస్తున్నారని,.. ప్రతిక్షణం ప్రజలకు సేవ చేసేందుకే ఆలోచిస్తూ ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు శ్రమిస్తారని గుర్తుచేశారు. అందుకే, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో దేశ ప్రజలంతా ఏకమవుతున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి 90 రోజులు గడిచినా కూడా అమలు చేయలేకపోతున్నారని చురకలు అంటించారు. కేసీఆర్ అడుగుజాడల్లో, బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో నిలిచేది, గెలిచేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ గారు మాట్లాడిన ముఖ్యాంశాలు: దేశంలో ఎక్కడికి వెళ్ళినా మోదీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. దాన్ని కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. అందుకే మోదీకి కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారు. కానీ దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులు అని మోదీజీ భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పేదలకు ఇళ్లు కట్టించిన ప్రధానికి సొంత ఇల్లు కూడా లేదు. రోజుకు 18 గంటలకు పైగా పనిచేస్తున్న మోదీ గారిని చూసి దేశ ప్రజలు ముగ్ధులవుతున్నారు. అందుకే దేశమంతా ఫిర్ ఏక్ బార్.. మోదీ సర్కార్ అని నినదిస్తోంది. వంశ పారంపర్యంగా రాజకీయాలు చేస్తున్న వారు దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ , నెహ్రూ కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తోంది. కేసీఆర్ కుమారిడినో, కూతురునో ముఖ్యమంత్రిని చేయడానికి బీఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారు. ఇలాగే తమిళనాడు తో పాటు పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కుటుంబం కోసం పని చేస్తున్నాయి. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా మోదీ గారు ‘పాలిటిక్స్ ఆఫ్ ఫర్ఫార్మెన్స్’ అనే నినాదంతో రాజకీయాల యొక్క నిర్వచనం మార్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు కుటుంబమే ఫస్ట్ అని చేస్తుంటే...మోదీ గారు మాత్రం నేషన్ ఫస్ట్ నినాదంతో పని చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం.. దేశ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం పనిచేస్తోంది. దేశంలో జరుగుతన్న అభివృద్ధి నుండి ప్రజల యొక్క దృష్టి మళ్లించడంకోసం కుటుంబ పార్టీలు కుట్రలు పన్నుతున్నారు. ప్రజలను వంచించి మోసం చేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అందరికి అన్నీ అని చెప్పి, ఇప్పడేమో ప్రభుత్వ పథకాలు కొందరికి కొన్నే అంటూ షరతులు పెడుతోంది. మహాలక్ష్మి పధకం లో భాగంగా మహిళలకు రూ. 2,500 ఇస్తామని చెప్పారు.. ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పి.. అధికారం లోకి వచ్చాక కొందరికే అని ఆంక్షలు పెడుతున్నారు. గృహ జ్యోతి పధకం ద్వారా అందరికీ 200 యూనిట్ల విద్యుత్ బిల్లు ఉచితం అన్నారు.. ఇప్పుడు రూ.200 మించి ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా మొత్తం భారం ప్రజలపై వేస్తామంటున్నారు.. రైతులకు రూ. 15 వేల చొప్పున, రైతు కూలీలకు రూ. 12 వేల చొప్పున భరోసా కల్పిస్తామన్నారు. రైతు భరోసా లేదు.. కూలీ భారోసాలేదు. 90లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉంటే 40లక్షల మందికే పరిమితం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి..ఇప్పుడు 5లక్షలు ఇస్తామంటున్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం అని చెప్పారు.. ఆ ఊసే లేదు. రైతు రుణమాఫీ లేదు..రైతు భరోసా లేదు. కూలీ భరోసా కూడా లేదు. రైతు బంధు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా 6 గ్యారెంటీలని తప్పుడు వాగ్ధానాలు చేసి ప్రజలను మోసం చేశారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడుతున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడుతుంది. ఇదిగో పులి అంటే..అదిగో తోక అన్నట్లుగా కాంగ్రెస్ మంత్రులు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోంది. మోదీ గారిని ఎదుర్కోలేక మూడు పార్టీలు ఒక్కటవుతున్నాయి. ప్రధాని మోదీ గారు రెండు రోజుల పాటు తెలంగాణ పర్యటనలో శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తే దాని గురించి మాట్లాడలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎదురుదాడి చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో మోదీ నామంతో బీజేపీ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరుఫున పోటీ చేయడానికి వాళ్ల నాయకులు ముందుకు రావడం లేదు. ఒత్తిడి చేసి పోటీలో పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందాలు పెట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాజకీయ రూపురేఖలు మారబోతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి అనుకూలంగా ఉంది. మోదీ మయం అయిపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నాయకుడి అనుచరులు పాకిస్తాన్ జిందాబాద్ అంటే వారిని కనీసం నిలువరించడం లేదు. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కనీసం నోరు మొదపలేదు. ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బట్టబయలైంది. భారత్ ను ధ్వేషించడమే కాంగ్రెస్ పార్టీ విధానం. దేశాన్ని వ్యతిరేకించడం, రామున్ని ధ్వేషించడం, పాకిస్తాన్ మీద ప్రేమ కురింపించడం దేనికి సంకేతం..?? హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న పార్టీలకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. మార్చి 12వ తేదీన అమిత్ షా గారు బూత్ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు ఎదుర్కోవడానికి మండల స్థాయి సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశాల ఏర్పాటుకు రూపకల్పన చేశాం. తెలంగాణలో నిలిచేది, గెలిచేది బీజేపీ మాత్రమే. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. బీజేపీని ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకున్నారు. గడీల పాలన, రాచరిక వ్యవస్థతో కొందరు చేతులు కలుపుతున్నారు. ఎవరు ఏక్ నాథ్ షిండో, ఎవరు కట్టప్పలో మేం జోస్యం చెప్పం. తెలంగాణలో బలమైన పునాదులు నిర్మించుకున్నాం. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో డబుల్ ఇంపాక్ట్ ఎట్లుందో ప్రజలు గమనిస్తున్నారు. బలమైన పునాదులతో డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో ఏర్పడబోతోంది. ఎప్పుడనేది ప్రజలు నిర్ణయిస్తారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం పైన సీబీఐ దర్యాప్తు చేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు..? బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు.

By BOLLI SATHYANARAYAN | March 07, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1