రాయికల్ మండలంలోని అతి పురాతనమైన శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామి (త్రికుటాలయం)లో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రోజున రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథంలో శివపార్వతుల ఉత్సవాలను ఉంచి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదానంలో సుమారు 5000 మంది పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, వార్డ్ కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.