|
modi add 1

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ గారు విడుదల చేసిన ప్రతికా ప్రకటన

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు కౌంటర్ ఇచ్చిన ఎన్వీ సుభాష్ తెలంగాణకు ఏం నిధులు ఇచ్చామో చెప్పడానికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. దమ్ముంటే... ప్లేస్, టైం చెప్పండి వేల కోట్ల రూపాయల నిధులను ఇస్తున్న బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తే... చూస్తూ ఊరుకోం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తన్ని, తరిమేసినా మీకు సిగ్గు రాకపోవడం విచారకరం. బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల రజాకార్ల సమితి. మీ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. మేడిగడ్డ మునిగిపోయింది. మీ అవినీతికి అంతే లేదు... అందుకే ప్రజాక్షేత్రంలో ముద్దాయిగా నిలబడ్డారు. ఇవాళ కూడా ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా రూ.41000 కోట్లతో 554 రైల్వే స్టేషన్లు, 1500 ఆర్ఓబీ/అండర్ పాస్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా అంకితభావంతో పనిచేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైన నిధులు ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9 లక్షల 50 వేల కోట్లు కేటాయించింది. దీనిపై మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో అన్ని వివరాలు క్లుప్తంగా ప్రజల ముందుంచారు. అది మీకు గుర్తులేదా..? రూ.1,153 కోట్ల ఖర్చుతో కూడిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులకు తన నిబద్ధతకు మించి నిధులు అందించి హైదరాబాద్ పౌరుల సుదీర్ఘ కలను సాకారం చేస్తోంది. ఆదర్శ్ పథకం ద్వారా రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. 15 స్టేషన్ల పునరాభివృద్ధి.. 48 ఆర్ఓబీలు/ అండర్ పాస్ ల నిర్మాణాలు జరిగాయి. రూ. 6,338 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసింది బీఆర్ ఎస్ కు కనిపించడం లేదా? తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం మంజూరు చేసింది మీకు గుర్తులేదా..? రూ. 1,366 కోట్లతో భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు మీకు కనపడటం లేదా..? రూ. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధిచేస్తోంది. కాజీపేటలో రూ. 521 కోట్లతో వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ను ప్రారంభించిన విషయం మీకు తెలియదా..? రూ.442.03 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని రామగుండంలో 100 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు మీకు కనపడటం లేదా..? చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో నిధుల విడుదలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఈసారి పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది గతంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని, కలిసి పోటీ చేసిన చరిత్ర ఆ పార్టీలదే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసే... బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి గత ఎన్నికల్లో ఇట్లాంటి ప్రచారం చేసి లబ్ది పొందాలని చూశారు ఈసారి మాత్రం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది మీ కారు సర్విసింగ్ కి కాదు, కంప్లీట్ గా షెడ్డుకి వెళ్ళింది. అటు నుంచి ఇక స్క్రాప్ కే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటిరిగానే 370 ఎంపీ స్థానాలను గెలుస్తుంది. ఎన్డీఏ కూటమి 400 సీట్లు కైవసం చేసుకుంటుంది.

By NYALAKONDA ANIL DESAI | February 26, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1