హైదరాబాద్. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటివరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఎన్నికల కమిటీ సమావేశం జరగలేదు. అలాగే అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరిగినట్లుగా పలు టీవీ చానల్స్ లో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం, సత్యదూరం. వ్యక్తి ఆధారిత పార్టీల్లో మాత్రమే ఇలాంటివి చెల్లుతాయి. భారతీయ జనతా పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక అనేది ప్రజస్వామ్యయుతంగా జరుగుతుంది. పూర్తిగా ఎన్నికల కమిటీ కూలంకుశంగా చర్చించిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించడం జరుగుతుంది. వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీలకు, ప్రజాస్వామ్యయుతంగా మెదిలే భారతీయ జనతా పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నాం. అలాగే, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా బీజేపీ అభ్యర్థుల ఎంపికపై పలు మీడియా ఛానల్స్, పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలేనని స్పష్టంగా తెలియజేస్తున్నాం. కార్యాలయ కార్యదర్శి.
Your experience on this site will be improved by allowing cookies.