|
modi add 1

ముత్యంపేట లో కవాతు నిర్వహించిన ఆర్మీ జవానుల

జనంగొంతు న్యూస్ //మల్యాల // జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో మరియు ముత్యంపేట గ్రామంలో ఆర్మీ జవానుల కవాతు నిర్వహించారు.సోమవారం సాయంత్రం 5 గంటలకు మల్యాల పోలీస్ స్టేషన్ నుండి ప్రారంబించి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ దగ్గర చేరుకోగానే ఆర్మీ జవానులకు,పోలీసులకు మల్యాల గ్రామ యువకులు సన్మానం చేశారు.తరువాత కవాతు చేసుకుంటూ ముత్యంపేట గ్రామంలో కి చేరుకున్నారు. గ్రామంలో ని వచ్చిన ఆర్మీ జవానులకు, పోలీసులకు,యువకులు, పెద్దలు వారిపై పూలు చళ్ళుతు, ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ కొండబత్తిని త్రినాధ్,బజరంగ్ సేన యూత్, ఛత్రపతి శివాజీ సేన, నేతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.ఆర్మీ జవానులను చూడటానికి మహిళలు, పెద్దలు ఆసక్తి చూపారు.యువకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారికి స్వాగతం పలికారు.

By NYALAKONDA ANIL DESAI | April 01, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1