రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామములోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలోశ్రావణ మాసం సందర్భయముగా హనుమాన్ భజన మండలి వారి ఆధ్వర్యంలో 30 రోజుల పాటు భజన కార్యక్రమము ప్రతి రోజు రాత్రి 8 గంటల నుండి 9:30 వరకు కొనసాగుతదని ఇట్టి కార్యక్రమము దేవాలయము పునః ప్రతిష్ట 2003 సంవత్సరం నుండి శ్రావణ మాసం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము చేపబడుతున్నాము అని ఈ సంవత్సరం మరొక కొత్త కార్యక్రమము తీసుకోవడం జరిగినది శ్రీ లలితా దేవి శాస్త్ర పారాయణం మాములు రోజులలో ప్రతి శుక్రవారం శ్రావణ మాసం మొత్తం 30రోజులు ఇంటింటా పారాయణం అనే కార్యక్రమము తీసుకొని 30 ఇండ్లలో శ్రావణ మాసం ముగిసే లోపు ప్రత్యేక పారాయణం మాతలచే నిర్వహించున్నాము అని ఇట్టి శ్రావణ మాసం కార్యక్రమములు అన్నియు లోక కళ్యాణర్థం మరియు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుట కోరకై నిర్వహించున్నామని హనుమాన్ భజన మండలి అధ్యక్షులు అనుమల్ల మల్లేశం తెలిపారు. ఇట్టి కార్యక్రమములో భజన మండలి సభ్యులు మరియు వేద పండితులు అంగడిమఠం భూవనేశ్వర్, గురు లింగుమఠం విక్రమ్ దేవాలయ చెర్మాన్ నామని శేఖర్ తదితరులు ఫాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.