*హైదరాబాదులోని ఎల్బీనగర్ లో వివిధ కాలనీలకు చెందిన ప్రముఖులు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ హైకోర్టు న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వివిధ బార అసోసియేషన్స్ ఎన్నికలలో చౌటుప్పల్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో చౌటుప్పల్ అడ్వకేట్స్ ద్వారా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో లైబ్రరీ సెక్రెటరీగా విజయం సాధించిన ప్రముఖ న్యాయవాది సామాజికవేత్త నర్రి స్వామిని వివిధ సామాజిక సంఘాలకు వివిధ రంగాల్లో ప్రముఖులైన ఎల్బీనగర్ లోని వివిధ కాలనీల ప్రముఖులు శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మర్రి స్వామి కుర్మ గారు మాట్లాడుతూ హైదరాబాదులో నేను నివాసం ఉండే ఎల్బీనగర్ లోని వివిధ కాలనీలకు చెందిన మా ఆత్మీయ బంధువులు మమ్మల్ని సన్మానించడం చాలా సంతోషకరం యొక్క సన్మానం మా యొక్క బాధ్యతను మరింత పెంచి సమాజానికి మరి ఎక్కువగా సేవ చేసే విధంగా ప్రోత్సహించే విధంగా నా యొక్క బాధ్యతను పెంచిందని తెలియజేశారు నన్ను సన్మానించిన వారికి మరియు నన్ను గెలిపించిన నా చౌటుప్పల్ బార్ అసోసియేషన్ న్యాయవాద సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సౌత్ అండ్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు రమేష్ సార్ గారు మాట్లాడుతూ నర్రి స్వామి గారు తెలంగాణ సామాజిక చైతన్య వేదికను స్థాపించి అనేకమైన సామాజిక కార్యక్రమాలు చేస్తూ న్యాయవాదులకు సేవ చేయాలనే సంకల్పంతో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో లైబ్రరీ సెక్రటరీగా ఎన్నికవ్వడం మా అందరికి చాలా ఆనందదాయకం భవిష్యత్తులో వారు ఇలాంటి అనేకమైన పదవులు అధిరోహించి సమాజ సేవలో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకులు చంద్రపురి నగర ప్రముఖులు రా మెల్ల వెంకటేశ్వర్లు, రాక్ టౌన్ కాలనీ ప్రముఖులు రాంజీ ,జనప్రియ కాలనీ ప్రముఖులు బద్రి జి ,చంద్రపురి నగర ప్రముఖుడు యోగా మాస్టర్ భరత్ జీ, చిత్ర సీమ కాలనీ నాయకులు, శ్రీనివాస్ గారు అనేకమంది సామాజికవేత్తలు శాస్త్రవేత్తలు సైంటిస్టులు రిటైర్స్ ఉపాధ్యాయులు అనేకమంది పాల్గొన్నారు
Your experience on this site will be improved by allowing cookies.