రాయికల్ మండల ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపిడివో చిరంజీవి అన్నారు. రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాల లో జరుగుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించారు. మండలంలోని అన్ని పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.మధ్యాహ్న భోజనం పరిశీలించి, నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు.శ్రద్ద తో చదవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల నిర్వహణ ను పరిశీలించి,ఉపాధ్యాయులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముక్కల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, అనుమల్ల సత్యనారాయణ, పీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, అంతడుపుల గంగారాజం, రాపర్తి నర్సయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.