హాజరైన మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు. అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచన అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలన్న సీఎం. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశం. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం.
పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క. ఉట్నూర్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు గొప్ప లక్ష్యాలను పెట్టుకొని ఆ దిశగా ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు సైతం అన్ని రంగాలు రాణించాలని పేర్కొన్నారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన చదువును మధ్యలో ఆపేయకుండా అన్ని అవరోధాలను దాటుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ //జనం గొంతు //ప్రవీణ్. జి రాయికల్ పట్టణములోని 9వ వార్డులోని అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సువర్ణ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి పిల్లల,తల్లుల ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో అంగన్వాడి సూపర్ వైజర్ జి.పద్మావతిగారు,టీచర్ లావణ్య, ఉమారాణి,ఆర్పీ శ్యామల, కోల రాధ వార్డు మహిళలు పాల్గొన్నారు.
ఆడపిల్లలకు ఆధునిక విద్య అందించాలి.....రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు పురుషులతో సమానంగా ఆడపిల్లలకు ఆధునిక విద్య అందించాలనే లక్ష్యంతో సావిత్రిబాయి తన జీవితాన్ని అర్పించారని మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు. శుక్రవారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలికల పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులు పద్మజ,పాతిమబేగం,వనిత, తిరుమల,పద్మ,తరంగిణి,రజిత,హైమవతి,హర్షియ,స్వరూప లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణచివేత కు గురైన వర్గాలకు న్యాయం దక్కేందుకు సావిత్రిబాయి తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మ్యాకల అనురాధ,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్,మాజీ జడ్ సి లు మ్యాకల రమేష్,కార్యదర్శి కడకుంట్ల నరేష్,క్లబ్ సభ్యులు వాసం ప్రసాద్, బొమ్మకంటి నవీన్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పొన్నం రమేష్,శ్రీనివాస్, ఉపాధ్యాయులు పారిపెళ్లి గంగాధర్,సత్యం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.