|
modi add 1

విస్డం స్కూల్ లో "చేతన "పాజిటివ్ పేరేంటింగ్ పై అవగాహన సదస్సు

రాయికల్ పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్స్ లో విస్డం స్కూల్ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు విద్యార్థులు తల్లి తండ్రులకు విస్డం స్కూల్స్ అధినేత డా.ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి ఆధ్వర్యంలో "చేతన" పాజిటివ్ పేరెంటింగ్ అనే అంశం పై అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. అనంతరం లైఫ్ కోచ్ శ్రీహరి తిరునగరి ప్రస్తుత కాలంలో విద్యా వ్యవస్థలో ఉన్న సవాళ్లతో పాటు నేటి భావితరపు విజ్ఞాన ఘనిగా మార్చాలనే ఉద్యేశంతో ఈ అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం అభినందనీయం అన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థుల ప్రవర్తన పై టివి లలో వచ్చే ఏడుపు గొట్టు సీరియల్స్ పనికి రాని షో లతో నేగేటివ్ ఇంపాక్ట్ పాడుతుంది అని దాంతోపాటు పెరిగిన సాంకేతిక సామజిక మాధ్యమాలు ఇంటర్నెట్ ఫోన్ వలన పూర్తిగా పిల్లల ప్రవర్తనలో మార్పులతో వస్తున్నాయి పూర్తిగా ఫోన్ గేమ్ లకు బానిసలుగా మారుతున్నారని వీటినుండి దూరంగా ఉంచి మంచి నైతికత నేర్పాలని సూచించారు.ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోచ్ మహిపాల్ మాదం , ఎన్ ఎల్ పి ట్రైనర్ ధర్మారెడ్డి, మోటివేషనల్ స్పీకర్స్ నరహరి నాయక్, లక్ష్మణ్ లు ప్రసంగిస్తూ ప్రస్తుతం పాఠశాల స్థాయికి చేరిన గంజాయి డ్రగ్స్ లాంటి చేడు అలవాట్లు దరి చేర నివ్వద్దు అని పిల్లలకు రోజు వారి సమయం కేటాయించి వారి అభిప్రాయాలకు విలువనివ్వాలని దాంతో తల్లితండ్రుల మంచి మార్గంలో నడిపించాలని దాంతో పాటు మానవీయ అనుబంధాలు సంసృతి సంప్రదాయాలను అలవరుచుకొనేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విస్డం విద్యాసంస్థల డైరెక్టర్ నివేదిత రెడ్డి 800 మంది పోషకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 17, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1