|
modi add 1

చెంగిచర్ల గొడవలకు కారణాలు ఇవేనా ?

చెంగిచర్ల గొడవలకు కారణాలు: పట్టణం విస్తరిస్తున్నకొద్ది హైదరాబాద్ పాత బస్తి లో నివశిస్తున్న STs లు ( షెడ్యూల్ తెగలు ST) కు చెందిన కొన్ని కుటుంబాలు ఉపాధి కొరకు చెంగిచెర్ల ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో ప్రధానంగా పిట్టలోల్లు గా పిలవబడుతున్న (వీరు స్థానికంగా వేటాడం – పక్షులు, జంతువులను వేటాడి జీవనోపాడి పొందుతున్నారు. అలాంటి వారు 25 సం క్రితం ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా అటవీ ప్రాంతం లాగా ఉండేది. ఈ సమయంలో 2004 లో ప్రభుత్వం ఇక్కడ జంతు వధశాలను ఏర్పాటు చేసింది. దీంతో ఈ కేంద్రం ఆధారంగా వ్యాపారం పెరగడం ప్రారంభం అయ్యింది. ఇక్కడికి మేకలను, గొర్రెలను తీసుకొని రావడం అమ్మకాలు చేయడం, ఇక్కడే వధించిన వాటిని పట్టణంలోని చాలా ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. 2004 లో ప్రారంభం అయిన తరువాత ఈ జంతు వధ శాల దాదాపు 70 ఎకరాలలో విస్తరించి ఉంది. దీంట్లో ప్రధానంగా ఉపాధి కొరకు ముస్లింలు ప్రవేశించి ఉపాధి పొందుతుండడం జరుగుతుంది. ఇదే సమయంలో వారి కొరకు ఇక్కడ నివాసాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు . అలాంటి ఒక నివాస సమూదాయమే ఈ పిట్టల బస్తికి మరో వైపు ఉంది..రోడ్డు ఒక వైపు పిట్టల బస్తి ఉంది , మరో వైపు ఇందిరమ్మ ఇండ్లు అనే ప్రభుత్వం కట్టించిన గృహ సముదాయం ఉంధి. దీంట్లో ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. వీరిలో అధికంగా బిహార్, బెంగాల్, మహారాష్ట్ర నుండి వచ్చి స్థిరపడిన వారె తప్ప స్థానికులు కారని చెబుతున్నారు. వారు ఎక్కువగా వధ శాలలో లో పని చేయడం జరుగుతుంది అన్నారు. దాంతో పాటు, ఈ వధ శాలలో ఏమి జరుగుతుందో బయటి సమాజనికి తెలువదు అని వారు అంటారు......దాంతో పాటు ఇక్కడ, మేకలు, గోర్రలే కాకుండా ఆవులను సైతం వదిస్తారు అనే అనుమానాలు ఉన్నట్టు కొంత మంది స్థానికులు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు (టీఎస్‌డబ్ల్యూబీ) మాజీ చైర్మన్ మహ్మద్ సలీమ్‌కు చెందిన సలీమ్ అండ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ కబేళా నడుస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. నిజానిజాలు సంబంధిత శాఖల అధికారులకే తెలియాలి. ఏది ఏమైనప్పటికి , ఈ ప్రాంతం లో ముస్లిం సమాజం యొక్క ప్రభావం ఎక్కవుగా ఉంది. దాంతో పాటు వీరికి స్థానికంగా ఒక మసీదు ఉంది (స్థానికుల అభిప్రాయం ప్రకారం ఆ మస్జీద్ ను ప్రభుత్వ స్థలం ఆక్రమించి కట్టారు అని చెబుతున్నారు) దాంట్లో వాళ్ళు నమాజ్ (ప్రార్దన) చేస్తూ ఉంటారు. ఇస్లాం లో ముస్లిం లు కానీవారి ని కాఫిర్ గా పేర్కొనడం అందరికీ తెలిసిన విషయమే. దాంతో పాటు కాఫిర్ లతో ఒక ముస్లిం ఏ విధంగా ప్రవర్తించాలి అని నియమావళి పై ఎన్నో చర్చలు మనం గమనిస్తూనే ఉంటాము. ఇక్కడే నివసిస్తున్న ఈ హిందువులు, తమ సంప్రదాయానికి అనుగుణంగా వేడుకలు , పండుగలు చేసుకోవటం పరిపాటి. కానీ ముస్లిం జనాభా పెరుగుతున్న కొద్ది వీరి పై వారి అధిపత్యపు ధోరణిని కనబరుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టని అమాయక హిందువులు వీటిని భరిస్తూ నే ఉన్నారు. కానీ ఈ వేధింపులు మితి మీరడం సైతం కొన్ని సంధార్బల్లో జరిగింది. హిందూ అమ్మాయిలను వేధించడం జరగటం తో కొంత ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికి , బస్తీ వాసులు ఇవన్నీ భరిస్తునే వస్తున్నారు. బస్తి వాసుల కథనం ప్రకారం రంజన్ మాసంలో హిందువులు పాటలు పెట్టడం అనేది ఒక సాకు మాత్రమే అని, ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా పోలీసులు అధికారులు చర్యలు తీసుకొవడంతో పాటూ బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 30, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1