సుల్తానాబాద్,మే 2 (జనం గొంతు ):విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రేగడి మద్దికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాధాస్వామి, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి అన్నారు.సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ఆదేశాల మేరకు పి ఈ టి దాసరి రమేష్ ఆధ్వర్యంలో వేసవికాల టెన్నికాయిట్ క్రీడా శిబిరమును పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాస్వామి, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు, క్రీడల్లో పాల్గొని మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరిక ధారుఢ్యనికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల ఎస్ జి ఎఫ్ కన్వీనర్ ప్రణయ్, టెన్నికాయిట్ జాతీయ క్రీడాకారుడు బలరాం, రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ సెక్రెటరీ, అల్లిపూర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ లలిత, సతీష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.