ఈ రోజు వేంకటా పూర్ మండలం బూర్గుపేట గ్రామానికి చెందిన బినవేని శ్రీలత ఆనందపూర్ గ్రామానికి చెందిన గుమ్మడి లక్ష్మీ మరియు ఆకులవారి పల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ లు మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పొరిక బలరాం నాయక్ గార్లు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు
ములుగు అసెంబ్లీ మహబూబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండల కేంద్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క సుడిగాలి పర్యటన చేశారు కొత్తగూడ స్థానిక మండల కేంద్రం గాంధీనగర్లో సిసి రోడ్లు ప్రారంభోత్సవం చేశారు జవహర్లాల్ నెహ్రూ యువజన సంఘం 25 లక్షల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు గంగారం మండల కేంద్రంలో కస్తూరి గాంధీ విద్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం అదనపు భవనం మంజూరు కాగా భూమి పూజ చేసిన మంత్రి సీతక్క, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆరు గ్యారెంటీలో ఈరోజు మహబూబాద్ జిల్లా ఎస్సీ విద్యుత్ అధికారి జనగాం నరేష్ సార్ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ జీరో బిల్లును లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ... జిల్లాలో మొట్టమొదటిసారిగా బావురుకొండ నుంచి గృహజ్యోతి పథకం జీరో బిల్లును లబ్ధిదారులకు అందజేయడం గర్వంగా ఉందని అన్నారు కోమట్ల గూడ కోదండ రామాలయం అభివృద్ధి పనులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతంలో నన్ను ఆదరించిన వారందరినీ నేను ఎప్పటికీ మర్చిపోను ఈ ప్రాంత బిడ్డల్ని విద్యా వైద్యం పోడు భూముల సమస్యలను అన్ని సమస్యల పరిష్కరించి ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా ప్రతి కుటుంబానికి చేరవేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు కోమట్ల గూడెంలో మంత్రి సీతక్కను ఘన సన్మానం చేశారు, బావూరుకొండలో గ్రామస్తులు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలోనే గృహ జ్యోతి పథకం జీరో బిల్ ఇచ్చినందుకు పెద్ద మొత్తంలో వ్యవసారంగానికి పంటలు పండుటకు ఉచిత విద్యుత్ లో భాగంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఇచ్చినందుకు మంత్రి సీతక్కను గ్రామస్తులు గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎందా గ్రామంలో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే వేడ్మ బొజ్జుతో కలిసి సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదితో పాటు తదితర వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువులలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దిశ నిర్దేశం చేశారు.
Your experience on this site will be improved by allowing cookies.