|
modi add 1

యు డైస్ వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం

యు డైస్ వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం * జనంగొంతు పెద్దపల్లి ఓదెల ఈరోజు తేదీ 21.04.2025 న మండల కేంద్రంలోని ఎం ఆర్ సి కార్యాలయం లో ప్రధానోపాధ్యాయుల మరియు డైట్ కాలేజ్ కరీంనగర్ శిక్షణ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం ఎర్ర రమేష్ మండల విద్యాధికారి ఓదెల ఆధ్వర్యం లో జరిగింది. ఓదెల మండలంలో ఎంపిక కాబడిన 20 ప్రభుత్వ పాఠశాలల లో కరీంనగర్ డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులు కుమారి అఖిల మరియు కుమారి అమూల్య చే వెరిఫికేషన్ చేపించడం జరిగింది దీనిలో భాగంగా యు డైస్ లో నమోదు చేసిన సమాచారం క్రాస్ వెరిఫికేషన్ కోసం 20 పాఠశాలలను తేది 16.04.2025 నుండి తేది 21.04.2025 వరకు ప్రత్యక్షంగా పాఠశాల భవనాలు, తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీరు, ల్యాబ్ పరికరాలు క్రీడా స్థలం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు , మధ్యాహ్న భోజనం, వంటగది గార్డెన్ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను సేకరించడం జరిగింది. కావున ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఓదెల మండల ఎం ఆర్ సి యందు డైట్ శిక్షణ ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ వారిని సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది వెంకటేష్ కుమార్ సి ఆర్ పి లు రజిత, ఓంకార్, రాజేందర్, తిరుపతిరావు, మరియు కాంప్లెక్స్ హెచ్ఎంలు సాంబయ్య, లక్ష్మీనారాయణ ,జ్యోతి ,మహేందర్ రెడ్డి ,అశోక్ ,నాగరాజ్ ,రమేష్ ,లు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | April 22, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1