|
modi add 1

Padayatra that CM Revanth Reddy should be CM for another ten years

సీఎం రేవంత్ రెడ్డి మరొక పదేళ్లు సీఎం గా ఉండాలని, దానికి వాతావరణం సహకరించలని కోరుతు సమ్మక్క సారక్క ల వరకు యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఓయూ జేఏసీ చైర్మన్ ఒరుగంటి కృష్ణ అన్నారు.ఆదివారం సాయంత్రం ఓయూ నుండి సమ్మక్క సారక్క వరకు ఒరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో పాదయాత్ర ను ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి ప్రారంభించారు.గత ప్రభుత్వం రాష్ట్ర ఖజాన మొత్తం ఖాళీ చేసి కుటుంభం కుటుంభం మొత్తం ఆస్తులు సంపాదించుకొని ఆర్ధిక వ్యవస్థను దివాళా తీయించిన గొప్ప కుటుంభం కేసీఆర్ అన్నారు. ఇవ్వాళ్ళ గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తు ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్న దూరదృష్టి గల సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు మానుకొని అహంకారం అనుచుకొని బి ఆర్ ఎస్ నేతలు వ్యహరించకుంటే ప్రజలు బుద్ది చెప్పడం తథ్యం అన్నారు.కార్యక్రమంలో సురేష్, లాల్ ,యాదగిరి, నరసింహ, సురేష్, సాయి, యాదగిరి, నగేష్, వంశీ, తో పాటు ఓయూ విద్యార్థులు పాల్గొన్నారు. ( పాదయాత్ర చేస్తున్న ఒరుగంటి కృష్ణ )

By NYALAKONDA ANIL DESAI | February 19, 2024 | 0 Comments

ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయగలిగితే నేను రాజకీయాలనుండి తప్పుకుంటా

5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకావు. పదేళ్ళ పాలనకే కేసీఆర్ కి ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగింది. కానీ మళ్ళీ మోడీనే ప్రధాని కావాలని దేశప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు ⁃ ఈటల రాజేందర్. విజయ సంకల్ప యాత్ర - ఆసిఫాబాద్ లో మాట్లాడిన ఈటల రాజేందర్. ఈ యాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుయ్యేలా ఒత్తిడి తీసుకురండి అని. కాంగ్రెస్ వారు నాలుగు వందల హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైనవి 66 ఉన్నాయి. పాలసీలు ప్రకటించుకింటూ పోయారు. ఎవరు సలహాలు ఇచ్చారో కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంలో వీటిని ఎలా అమలు చేస్తారు అని నవ్వుకున్న. వస్తామా రామా అని ఇచ్చినట్టు ఉంది. అమలు సాధ్యం కాదని తెలిసినా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి ఓట్లు పడవు అనే భయంతో అప్లికేషన్లు తీసుకొని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నా. సీఎం గారు… ఊరిస్తున్న మంత్రులారా .. మహిళలలకు 2500 రూ, కళ్యాణలక్ష్మి తులం బంగారం, మహిళాసంఘాలకు వడ్డీలేని రుణాలు ఎప్పటినుండి ఇస్తారు? కేసీఆర్ అడ్డగోలు హామీలు ఇచ్చినప్పుడే… నీ అయ్యజాగీరు కాదు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి అని చెప్పిన. ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు. మరి ఈ సిఫాయి రెండు లక్షల రుణమాఫీ ఎలా చేయగలడు. ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయగలిగితే నేను రాజకీయాలనుండి తప్పుకుంటా. 5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకావు. ఇప్పిడే నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించను కానీ విజ్ఞత గల ప్రజలారా ఆలోచన చేయండి. ఈ జిల్లాల్లో కేసీఆర్ 8 ప్రాజెక్ట్స్ లు నిర్మించినా తూములు కట్టలేదు కాలువలు తవ్వలేదు నీళ్లు ఇవ్వలేదు. అడవిబిడ్డలు ఆకాశంమీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఈ ప్రభుత్వం అయినా వెంటనే ఇవ్వాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్న. పదేళ్ళ పాలనకే కేసీఆర్ కి ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగింది. కానీ మళ్ళీ మోడీనే ప్రధాని కావాలని దేశప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు నరేంద్ర మోడీ నేను మీ పాలకున్ని కాదు సేవకున్ని అని చెప్తారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. UAE లాంటి ముస్లిం దేశంలో కూడా హిందూ దేవాలయం నిర్మించి ఇచ్చిన నాయకుడు మోదీ. brs కి ఓటు వేసినా, కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఏమీ రాదు. బీజేపీకి ఓటు వేస్తే నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు. ప్రపంచపటం మీద భారత కీర్తి పతాకం ఎగురవేయడానికి మరో సారి అవకాశం ఇవ్వమని మోదీ అడుగుతున్నారు. భారత దేశ సమగ్ర అభివృద్ధికోసం, పేదరికనిర్మూలన కోసం, దేశకీర్తిని పెంపొందించడం కోసం బీజేపీకి ఓటువేసి ఆశీర్వదించాలని కోరుతున్నాను అని ఈటల రాజేందర్ అన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 23, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1