- నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ . శ్రీకాంత్ మున్సిపల్. గోదావరిఖని/జనంగొంతు/అంబటి సతీష్ /. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఈ రోజు పారిశుద్ధ్య విభాగం సూపర్ వైజరీ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ లోపాలు సరిదిద్దుకుంటూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని అన్నారు. పారిశుద్ధ్య వాహనాలన్నీ పని చేసేలా చూడాలని అన్నారు. సమస్య దృష్టికి వచ్చిన వెంటనే జాప్యం చేయకుండా పరిష్కరించాలని అన్నారు. ప్రతి ఇంటి నుండి తడి చెత్త , పొడి చెత్త వేర్వేరుగా స్వీకరించాలని అన్నారు. చెత్త బయట పడ వేసిన వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. నగరాన్ని చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని ప్రజలను చైతన్యవంతం చేయాలని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కు వేలాది భక్తులు విచ్చేస్తునందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌళిక వసతులు కల్పించాలని అన్నారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బంది సేవలను షిఫ్ట్ ల వారీ గా ఉపయోగించుకొని జాతర పరిసరాలు , ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు , సెక్రెటరీ జి. రాజు , సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్ సుందర్ , సునీల్ , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , సానిటరీ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని/జనంగొంతు/అంబటి సతీష్ / రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి ఎన్నికైన మీరు క్రమశిక్షణ తో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని ట్రైనీ కానిస్టేబుళ్ళకు పోలీస్ కమిషనర్ సూచించారు. పోలీస్ కానిస్టేబుళ్ళ నియామకంలో భాగంగా స్టయిఫండరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ళగా ఎంపికై తొమ్మిది నెలల శిక్షణకు వెళ్ళుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లతో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపిఎస్ మాట్లాడడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుళ్ళ నియామాకాల్లో సివిల్ కానిస్టేబుళ్లు పురుషులు మొత్తం 150 శిక్షణా కేంద్రం ఖమ్మం, ఆర్ముడ్ కానిస్టేబుళ్లు పురుషులు మొత్తం 110 శిక్షణా కేంద్రం వికారాబాద్, AR మహిళా కానిస్టేబుళ్లు మొత్తం 35 శిక్షణా కేంద్రం,మేడ్చల్, సివిల్ మహిళా 86 శిక్షణా కేంద్రం TSPA, హైదరాబాద్ లో తొమ్మిది నెలల శిక్షణ అందజేయబడుతుందని. నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలకు సేవలందించే రీతిలో ట్రైనీ కానిస్టేబుళ్ళకు శిక్షణ సమయంలో మానసికంగా, శారీరకంగా, అలాగే వివిధ అంశాలపై అవగాహన కల్పించే తరహలో శిక్షణ అందజేయబడుతుందని. మీరు ఎలాంటి పరిస్థితులోనైనా విజయంగా సాధించే తరహలో శిక్షణ అందించబడుతుందని, మీరూ పొందే శిక్షణతో మీరు పదవీవిరమణ పోందే వరకు ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కోనే పోలీస్ అధికారిగా రూపాంతరం చెందుతారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండి సేవా చేసే అవకాశం ఒక్క పోలీస్ శాఖ కి మాత్రమే ఉంటుంది అన్నారు. పోలీస్ ఉద్యోగం సాధించిన మీకు సమాజం లో, కుటుంబంలో మంచి మర్యాద, గౌరవం, గుర్తింపు లభిస్తుంది అన్నారు.
జనంగొంతు/గోదావరిఖని/అంబటి సతీష్ / గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు,ఈ మీడియా సమావేశంలో గత ప్రభుత్వం రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చి నిరుద్యోగాన్ని మరింతగా పెంచారని, ఇక్కడి పరిశ్రమలు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే నిధులను పక్క నియోజకవర్గాలకు తరలించడం జరిగిందని ఆయన అన్నారు. శాసనసభ్యుడుగా ఇక్కడి ప్రజలు నన్ను గెలిపించినందుకు వారి సేవ చేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని,అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తాను ప్రత్యేక శ్రద్ధ వహించి రానున్న తరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం అని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. రామగుండానికి 29 కోట్లతో ఆర్ అండ్ బి నిధులు కేటాయించామని, 10 కోట్లతో DMFT,10 కోట్లతో ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్స్,సింగరేణి సంబంధిత ప్రాంతాల్లో సింగరేణి వారి సహకారంతో రోడ్లు డ్రైనేజీలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు, మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పిడియస్ బియ్యన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిని టాస్క్ ఫోర్సు సిబ్బంది శ్రీనివాస్, ప్రకాష్,అఖిల్లోద్దీన్, మల్లేష్ లు కలిసి కళ్యణ్ నగర్ వద్ద తనిఖీ నిర్వహించి AP 15TA 1957 టాటా ACE ట్రాలీ ను ఆపి తనిఖీ చేయగా బ్యాగ్ లలో నింపి ఉన్న పిడియస్ రైస్ సుమారు 25 క్వింటాళ్ల గుర్తించి వాటిని స్వాధీన పరుచుకొని ట్రాలీ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించినట్లు, నిందితుల వివరాలు 1) చింతల రాజేందర్ s/o పుల్లయ్య, 30 yrs , బుడిగె జంగం, ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల. 2) చిప్పకుర్తి ప్రవీణ్ s/o లింగయ్య, మాది 22 yrs, ఎన్టీఆర్ నగర్, మంచిర్యాలగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బింగి అనిల్ కుమార్ మరియు కార్పొరేటర్లు BRS పార్టీని వీడి రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా కండవాకప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు
Your experience on this site will be improved by allowing cookies.