జనం గొంతు పెద్దపల్లి ఓదెల* గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తు పత్రాలను ఎంపీడీవో కార్యాలయం లో ఇవ్వగలరు అని ఎంపీడీవో జి తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ చేసుకున్న దరఖాస్తు ఫామ్స్ తో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం మరియు ఏదైనా రంగంలో ప్రావీణ్యం ఉన్న సర్టిఫికెట్లు మరియు ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో సహా మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 12 గంటలకు అందజేయగలరని ఎంపీడీవో తెలియజేశారు.
Your experience on this site will be improved by allowing cookies.