తా గెలువనమ్మమ తానోడి గెలిచినమ్మ ఓడేనని ప్రచారం చేసుకుందట అల వుంది కాంగ్రెస్ పరిస్థితి. గడిచిన 78 ఏండ్ల లో దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారం చలయించింది. ఇన్నాళ్ళు అనుభవించిన అధికార దాహం ఇంకా తీరక పోవడం తో ఎంతటి విశాప్రచారనికైన దిగజారుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ, దాని పెద్దలు RSS మీద తప్పుడు ప్రచారం చేస్తూ పట్టుబడ్డారు . మనీష్ తివారీ, జైరామ్ రమేష్ లాంటి వాళ్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో వదిలి — “RSS 1925 నుంచి 1947 వరకూ ఏ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు” అని అబద్ధం పండిస్తున్నారు. కానీ ఆ పేపర్ కాస్త దగ్గరగా చూసామంటే — అదంతా పూర్తిగా AIతో తయారైన కట్టుకథే RSSని చెడుగా చూపించాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ మరో కొత్త సాహసం చేసింది అంతే. RSS సర్సంఘ్చాలక్ డా. మోహన్ భాగవత్ గారు “RSS శతాబ్దోత్సవం – కొత్త దిశలు” అనే మూడు రోజుల కార్యక్రమం న్యూ ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ప్రారంభించబోతున్న సమయంలోనే, కాంగ్రెస్ ఈ ఫేక్ ప్రచారం వదిలింది. 🤖 AIతో తయారైన ఫేక్ పేపర్ కాంగ్రెస్ వాళ్లు పంచిన ఆ డాక్యుమెంట్ ఏ చరిత్ర పత్రం కాదు AIతో తయారైన నకిలీ పేపర్. ఆ పేపర్లో “British Home Department” అని రాసి ఉంది, కానీ బ్రిటిష్ ఇండియా కాలంలో అలాంటి శాఖ అసలే లేదు. ఈ ఒక్క విషయం చాలు — అది ఫేక్ అని వెంటనే అర్థమైపోతుంది. 🦁 వక్రీకృత సీల్, అర్థం లేని పదాలు ఆ పేపర్లో ఉన్న సీల్ కాపీ పేస్ట్ చేసినట్టుంది. అసలైన బ్రిటిష్ ఎంబ్లమ్ మోటో “Dieu et mon droit” (దేవుడు మరియు నా హక్కు) — కానీ కాంగ్రెస్ వాళ్ల ఇమేజ్లో “Dieu Droit” అని ఉంది. అదేమో అర్థమే లేని పదం! సీల్ మీద ఉన్న సంతకాలు కూడా గజిబిజిగా, AI పుట్టించిన వాటిలానే ఉన్నాయి. 📝 తప్పు పేర్లు, తప్పు పదజాలం ఇంకో పెద్ద పొరపాటు ఏమిటంటే — ఆ పేపర్లో “RSS” అని వాడారు. బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో ఎప్పుడూ “R.S.S.S.” అని మాత్రమే వాడేది. అందువల్ల ఈ డాక్యుమెంట్ పూర్తిగా కట్టుకథ అని స్పష్టమవుతుంది. ఇదంతా చూసినప్పుడు తేలిపోతుంది — కాంగ్రెస్ RSS మీద ఫేక్ AI పరికరాలతో దుష్ప్రచారం చేస్తోందని. దేశానికి సేవ చేసిన వారిని గౌరవించకుండా, రాజకీయ కసితో అబద్ధాలు పండిస్తోంది. ✊ సంఘ్ – సత్యాగ్రహం RSS స్థాపకుడు 1930లో గాంధీ గారు చేసిన దండి యాత్రలో RSS స్థాపకుడు డా. హెడ్గేవార్ గారు కూడా పాల్గొన్నారు. RSS సర్సంఘ్చాలక్ పదవి వదిలేసి, స్వాతంత్ర్య పోరాటంలో ముందుకు వచ్చారు. ఆయన కూడా జైలుకెళ్లారు. హెడ్గేవార్ గారు ఎప్పుడూ చెప్పేవారు — “దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడేటప్పుడు అందరూ కాంగ్రెస్ కింద ఏకం కావాలి. అదేవిధంగా RSSలో ఉండి హిందూ సమాజం లో రావాల్సిన సంస్కరణలు మరియు సంఘటనా కార్యం చేయాలి అని చెప్పారు 1930 జూలై 21న యవత్మాల్లో ఆయన చేసిన సత్యాగ్రహం తర్వాత, తొమ్మిది నెలల కఠిన శిక్ష విధించారు. 100కి పైగా స్వయంసేవకులు అకోలా జైలుకి పంపబడ్డారు RSS ప్రాభవం పెరుగుతున్న క్రమంలో, బ్రిటిష్ ప్రభుత్వం 1932లో ప్రభుత్వ ఉద్యోగులు RSS కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆదేశం జారీ చేసింది. 1933లో బ్రిటిష్ సెక్రటరీ MG హాన్లెట్ RSSపై సమాచార సేకరణ ఆదేశించాడు. డిసెంబర్ 1933లో RSSని “కమ్యూనల్” అని ముద్ర వేసి, ప్రభుత్వ టీచర్లు సభ్యులు కాకూడదని చెప్పాడు. కానీ 1934లో మధ్యప్రాంత అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులే ముందుకొచ్చి — “RSS మీద నిషేధం తీయాలి” అని బహిరంగంగా మాట్లాడారు. 🇮🇳 క్విట్ ఇండియా ఉద్యమంలో RSS పాత్ర డా. హెడ్గేవార్ గారి మరణం (1940) తర్వాత, శ్రీ గురుజీ గోల్వాల్కర్ నాయకత్వంలో RSS స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనప్పుడు విదర్భ ప్రాంతం మొత్తం RSS కార్యకలాపాలతో కదిలిపోయింది. RSS కార్యకర్తలు దాదా నాయక్, బబురావ్ బేగాడే, అన్నాజీ, కాంగ్రెస్ నాయకుడు ఉద్ధవరావు కోరేకర్ లతో కలిసి ఉద్యమం నడిపారు. ఈ పోరాటంలో యువ స్వయంసేవకుడు బాలాజీ రాయపుర్కర్ ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత జరిగిన చిమూర్ ఘటన (చిమూర్-అష్టీ ఎపిసోడ్)లో 125 మంది సత్యాగ్రహీలు, వేలాది స్వయంసేవకులు జైలుకెళ్లారు. హేము కలాని, దాదా నాయక్ లకు మరణదండన విధించారు. 1943లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో స్పష్టంగా రాసి ఉంది — “RSS అసలు లక్ష్యం బ్రిటిష్వాళ్లను భారత్ నుంచి తరిమేయడమే. స్వయంసేవకులు దేశంకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు.” — ఈ మాటలకంటే పెద్ద సాక్ష్యం ఏదీ ఉండదు! ☭ కమ్యూనిస్టుల అసలు ముఖం అదే కాలంలో కమ్యూనిస్టులు మాత్రం స్వాతంత్ర్య ఉద్యమానికి దూరంగా ఉండి, “భారత స్వాతంత్ర్యం అసలు నిజమైనది కాదు” అని పిలిచారు. రాజ్యాంగాన్ని కూడా “బుర్జువా పత్రం” అని తిట్టేశారు. కానీ నిజం ఏంటంటే — ఇలాంటి ఫేక్ ప్రచారాలతో RSS స్వయంసేవకుల త్యాగాలు చెరగవు. వాళ్లు చేసిన సేవ, త్యాగం వల్లే ఈ దేశం ఈ రోజు బలంగా నిలిచింది. RSS స్వయంసేవకులే “భారత భవిష్యత్తు”కి నడకరాళ్లు అయ్యారు. వాళ్లు చేసిన కృషిని ఎవరూ చెరపలేరు — అది చరిత్రలో బంగారు అక్షరాలతో ఉంది.
Your experience on this site will be improved by allowing cookies.