ఈరోజు మంగపేట మండల నరసింహ సాగర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరీ అనసూయ సీతక్క గారి చొరవతో మంజూరైన 10 లక్షల సిసి రోడ్డును కొబ్బరికాయ కొట్టి రోడ్డును ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి గారు ఈ కార్యక్రమం లో.... గ్రామ పార్టీ అధ్యక్షులు తాతినేని హరికృష్ణ, మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మండల ఉపాధ్యక్షులు గాదె శ్రావణ్ కుమార్, మండల సీనియర్ నాయకులు... లోకు సత్యం, అన్నాల వెంకన్న, కొంకర బుచ్చి రాములు, బండి రాములు, దోమల నరేందర్, కోడం శ్రీకాంత్, దోమల పుల్లారావు, బోడ సతీష్, చందా నరేష్, తదితరులు హాజరయ్యారు....
బెంగాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన షేక్ షాజహాన్ పలువురు SC, ST సామాజిక వర్గానికి చెందిన వారిపైనా మహిళలపై అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. తనకు నచ్చిన గ్రామ మహిళను పార్టీ కార్యాలయానికి పిలిపించి చిత్రహింసలు పెట్టేవారు. చాలా మంది హిందూ మహిళలు దీని బారిన పడ్డారు. ఇది కేవలం 'లవ్ జిహాద్' మాత్రమే కాదు, షేక్ మరియు తృణమూల్ సిరల్లో లోతుగా ఉన్న హిందూ ద్వేషం యొక్క వ్యక్తీకరణ. ఈ విషయాన్ని అటు పోలీసులు గానీ, ఇటు ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు. బెంగాల్లో దేవుళ్ళ మరియు దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినా, హిందూ మహిళలపై అఘాయిత్యాలు, హిందూ భక్తులను చంపడం లేదా హిందూ ఊరేగింపులపై దాడులు. కొద్దిరోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచార పర్యటనలో బాంబు పేలుళ్లు చేసి ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసిన లేదా ఆఫీస్ బేరర్లుగా ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా కుర్తాకు గురయ్యారు. ఇందుకు సంబంధించి స్వయంగా మహిళా ప్రతినిధులే బహిరంగ ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేడు బెంగాల్లో హిందువులు తమ సంప్రదాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు హిందువులపై యాక్షన్ ప్లాన్ చేస్తే ఇప్పుడు అదే ప్లాన్ తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో అమలు చేస్తోందని తెలుస్తోంది. కాబట్టి బెంగాల్లో హిందువులపై జరుగుతున్న అణచివేతను అరికట్టాలంటే వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి అని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు దావు సంతోష్ కుమార్ కలెక్టర్ ద్వార రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో HJS కట్టా సత్యనారాయణ చారిగారు ఉప్పులేటి లక్ష్మణ్ శ్రీకాంత్ శేఖర్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు
సుల్తానాబాద్,జూన్ 29 (జనం గొంతు): సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా మాటేటి సంజీవ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ 23వ ప్రతిష్టాపన మహోత్సవం లో భాగంగా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ జిల్లా గవర్నర్ లయన్ చిదుర సురేష్ నూతన అధ్యక్షులుగా లయన్ మాటేటి సంజీవ్ కుమార్, కార్యదర్శిగా పిట్టల వెంకటేష్, కోశాధికారిగా పూసాల సాంబమూర్తి,ఇతర కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి చిదుర సురేష్ మాట్లాడుతూ సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, కంటిచూపు లేనివారికి ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసి అంధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించినారని అభినందించారు.అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గం మరిన్ని ఉత్తమ సేవలు చేస్తూ క్లబ్ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించాలని కోరారు.అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తనపై విశ్వాసంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న కాలంలో క్లబ్ సభ్యుల సమన్వయంతో చక్కటి సేవా కార్యక్రమాలను చేపడుతూ జిల్లాలోనే ఉత్తమ క్లబ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా గవర్నర్ చిదుర సురేష్, రీజియన్ చైర్మన్ గాలిపెల్లి వెంకట్, జోన్ చైర్మన్ వేముల విష్ణుమూర్తి, జి ఎల్ టి మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా కో-ఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, కొండ రాంబాబు, సుధాకర్, కార్యవర్గ సభ్యులు దీకొండ భూమేష్, గజభీంకార్ జగన్, నవీన్, సంపత్ నూతనంగా చేరిన 10 మంది సభ్యులతో పాటు పాఠశాల డైరెక్టర్ క్రిష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.