ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుకు చర్యలు గురువారం నాడు, జిల్లాలోని శామిర్పెట్ వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3.20 ఎకరాల్లో 15 కోట్లతో నిర్మించిన మహిళా వృద్ధాప్య ఆశ్రమాన్ని (రుద్రమ దేవి ఓల్డ్ ఏజ్ హోం సొసైటీని) రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు అదే విధంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్ధలు) పింకేశ్ కుమార్, ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్షి, తదితరులు ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని సీతక్క గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెద్దవాళ్ళు పసి పిల్లలతో సమానమని, వారి ఆలన పాలన చుస్కోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఎంతో ఉందన్నారు. వాళ్ళు లేకుంటే మనం లేమని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆశ్రమాల అవసరం మనకి రాదని అన్నారు. ప్రభుత్వం వృద్దులకు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే నీటిని అందిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అదే విధంగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. ఈ రుద్రమ దేవి సొసైటీ మనందరికీ ఆదర్శమని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆరు గ్యారెంటీలతో రూపకల్పన చేసిందన్నారు. తొలి విడతగా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పాలకుర్తి, శాసనసభ్యులు యశశ్విని రెడ్డి, రాణి రుద్రమ్మ మహిళా సొసైటీ సీఈవో కవిత రెడ్డి, డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, వివిధ శాఖల అధికారులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు
*-జలుబు చేసిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి.* *-అందుబాటులో ఉండని వైద్యులు, అందని వైద్యం.* *-నిధులు ఉన్న నిరుపయోగంగా సౌకర్యాలు,* *-నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్.* *షేక్ సాబిర్ అలి,* సామాజిక కార్యకర్త. జమ్మికుంట ప్రభుత్వ 30పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోగులకు అదనపు సౌకర్యాల ద్రుష్ఠ్య గతంలో ఆధునికరించటం జరిగింది. ఈ ఆసుపత్రికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి నిత్యం అత్యవసర మరియు దీర్ఘకాలిక మరియు డయాగ్నస్టిక్ మరియు ప్రసూతి సంబంధిత వైద్యం విషయమై వందలాది మంది రోగులు వారి బంధువులు వస్తుంటారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం మరియు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ పూర్తిస్థాయి వైద్య సేవలు, సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు మరియు వారి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు వైద్యులకు స్టాప్ క్వార్టర్స్ అందుబాటులో ఉన్న కూడా విధుల్లో ఉండి కూడా వైద్యులు అందుబాటులో లేని కారణంగా సకాలంలో వైద్యం అందక రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన దుస్థితి. మరీ ముఖ్యంగా మార్చురి నిర్వహణ సరిగా లేక పోస్టుమార్టం కోసం సైతం ఆసుపత్రి డ్రెస్సింగ్ సిబ్బంది మరియు అటెండర్ లపై ఆధారపడాల్సిన దుస్థితి. ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సరైన మానిటరింగ్ సిస్టం లేక ఆసుపత్రికి వెచ్చించాల్సిన నిధులలో సైతం అక్రమాలు జరుగుతున్నాయని తెలియుచున్నది. ఇట్టి విషయాలపై ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులచే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిస్తూ బాధ్యులపై శాఖపరమైన చర్యలతో పాటు ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ ఆసుపత్రి యందు రోగులకు వారి బంధువులకు పూర్తిస్థాయి సేవలను కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆసుపత్రి అభ్యున్నతి మరియు రోగుల అవసరముల దృష్ట్యా రిలే దీక్షల ద్వారా సమస్యల సాకారానికీ ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో అందర్నీ సమదృష్టితో చూడాల్సిన సాక్షాత్తు కులపతి సమక్షంలో రాముడిని తిట్టే *సమూహం* ఒక సమావేశం పెట్టుకుంది. అందులో ప్రజాస్వామ్యం, భావవ్యక్తీకరణ అన్న పదాలు సర్వసాధారణంగా ఉపయోగించి రామాయణాన్ని సనాతన ధర్మాన్ని దుమ్మెత్తి పోసే పనికి పూనుకున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గ్రహించింది. ఆ సంఘం ప్రతినిధులు చెప్పినట్టుగా విద్యార్థులకు రామాయణం రాకపోవచ్చు కానీ రాముని పట్ల భక్తి ఉంది. మీరంతా రామాయణం ఆపోసిన పట్టారు కానీ రాముని ద్వేషిస్తారు. అంతే తేడా...!? సాహిత్య వేత్తలకు మాత్రమే రాముడిని తిట్టే అర్హత ఉందా? ఈ దురాగతాన్ని అడ్డుకునే అధికారం రామ భక్తులకు లేదా? చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి రామదాసు లెవెల్ లో రామ భక్తుల్లా ఫోజులిస్తున్నారు... భావవ్యక్తీకరణ పేరుతో రాముని యొక్క వ్యక్తిత్వాన్ని విధ్వంసం చేయడమే ఈ విధ్వంస రచయితల ప్రధాన లక్ష్యం. మరి అంత భావవ్యక్తీకరణ మీద ప్రేమ ఉన్నవాళ్లయితే అదే వరంగల్లో సత్యనారాయణ అనే గుడి పూజారి దేవాలయం పైన మైకు పెడితే కొట్టి చంపాడు ఓ అన్యమతస్తుడు. ఆరోజు వీళ్లంతా వరంగల్లో ఉన్నారా? ఊడ్చుకు పోయారా ? అదే వరంగల్ కు దగ్గర్లో భైంసాలో జరిగిన హింస వీళ్ళ కవితలకు పనికి రాలేదా? వీళ్ళ పెన్నులకు జ్వరం వచ్చిందా? వీళ్ళ సెమినార్లకు ఏం మాయ రోగం వచ్చింది.? ఈ శుక్రనీతి ఇంకెన్నాళ్లు.. కేవలం హిందువులను తిట్టడానికి హిందూ ఇతిహాస పురాణాలను అవమానించడానికి అన్ని విశ్వవిద్యాలయాల్లో తిష్ట వేసుకున్న వామ పక్షులు చేస్తున్న ద్రావిడ ప్రాణాయామం ఇది... రామాయణ విషవృక్షం రాశారు ఇంకేం కావాలి? ఒకాయన సీతా జ్యోస్యం రాసాడు... ఇంకెన్నాళ్లు తిడతారు? పేరులో *విద్మహే* ఉన్నంత మాత్రాన గాయత్రీ మంత్రం అయిపోదు. ప్రతి విశ్వవిద్యాలయంలో పుట్టుకొస్తున్న ఈ మంథరలు, మారీచ సుభాహులు ... వేస్తున్న మారు వేషాలను... జ్ఞానం.. శీలం. ఏకత మనసు నిండా ఉన్న రామ భక్తులు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో ఈ అర్బన్ నక్సల్స్ హడావిడి ఇంత అంతా కాదు. వీళ్ళు వంద మంది ఉంటే మహాసభ అంటారు ఐదు మంది ఉంటే రౌండ్ టేబుల్ అంటారు. పాడిందే పాట గా హిందుత్వను తిట్టగానే హీరోలుగా మారిపోతామని భావిస్తారు. మతోన్మాదం.. ఫాసిస్ట్ వంటి పడికట్టు పదాలు వాడుతూ లోలోపల హైందవ విధ్వంసమే వీళ్ళ లక్ష్యం. గతంలో ఇది కనిపెట్టడం కష్టం అయ్యేది. ఇప్పుడు వీళ్ళ హిపోక్రసీ బయటపడిపోతుంది. పదిమంది మీపై భౌతిక హింసకు దిగారని బాధపడిపోతున్నారు. మరి కోట్ల మంది రామభక్తుల మనోభావాలపై మీరు చేస్తున్న గాయాలు ఎవరికి చెప్పుకోవాలి? హింస అంటే కేవలం శరీరపరంగా గాయపరచడం మాత్రమే కాదు మానసికంగా బాధ పెట్టడం కూడా అన్న నిర్వచనం ఉందన్న సంగతి ఈ మహా మేధావులకు తెలియదనుకోవాలా... తెలిసి చేస్తున్నారనుకోవాలా...? చర్య జరపడం వీళ్ళ వంతు. ప్రతి చర్య జరిగితే గగ్గోలు పెట్టి ప్రజాస్వామ్యం భావ స్వేచ్ఛా అనడం ఎంతవరకు కరెక్ట్.! రామాయణం పై మాట్లాడే అధికారం కేవలం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లకు మాత్రమే ఉంది అని భావిస్తున్న వాళ్లు... అదే రామాయణం పై అనేక పరిశోధనలు చేసిన విశ్వవిద్యాలయ ఆచార్యులు ఎందరో ఉన్నారు. వీళ్ళలా విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు వెలగబెట్టకపోవచ్చు కానీ బయట ఎందరో రామాయణం పై పరిశోధన చేసిన వాళ్లు ఉన్నారు. వాళ్ళని పిలిచి సంవాదం పెట్టాల్సింది. అలా కాకుండా అర్బన్ నక్సల్స్ అంతా ఒకచోట చేరి సాహిత్యం పేరిట జరుగుపుతున్న ఈ విధ్వంసానికి ప్రజాస్వామ్యం ...ప్రజా సంఘాలు అని పేరు పెట్టుకోవడం ఎందుకు? నిజంగా మీకు రంగనాథ రామాయణం ...భాస్కర రామాయణం... మొల్ల రామాయణం రామాభ్యుదయం... నిర్వచనోత్తర రామాయణం ...ఎర్రన రామాయణం... చివరకు వరంగల్లో పుట్టిన పండరీనాథ రామాయణం దేని పైన అయినా చర్చ చేయాల్సింది. సమఉజ్జీలతో కదా! ఫాసిస్టులు అనీ హిందువులను నిందిస్తున్న మీరు కనీసం ఇతర మతాల గురించి ఒక్క మాటైనా మాట్లాడగలరా? మీ సమూహ కేవలం ఒక మతాన్ని... దానికి సంబంధించిన పాత్రలను దూషించడం లక్ష్యాలుగా పెట్టుకుందా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.!? మీరు రాముడినీ ఎంత తిట్టినా ఇవాళ అతి ఎక్కువ మంది వ్యూవర్షిప్ ఉన్న సీరియల్ రామాయణం. అతి ఎక్కువ మంది పాడుకున్న పాట హనుమాన్ చాలీసా. మీరు రాస్తున్న కవిత్వం.. కథలు మీ కొంపలో ఉన్న కుటుంబ సభ్యులైనా చదువుతున్నారా? మీలాగా ద్వేషించడానికి ఈ దేశంలో రామాయణ పారాయణం జరగడం లేదు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని గుణగణాలు మానవాదర్శంగా ఈ దేశం ఎప్పుడో స్వీకరించింది. సూర్యుడి పై ఉమ్మేసే ఈ పిచ్చి ప్రయత్నం మానుకుంటే రచయితలుగానైనా సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. అవార్డులు కొట్టేసి అప్పనంగా ఊరేగుతున్న మీరు 100 మందిని కూడా ప్రభావితం చేయలేకపోతున్నారు. జాబాలిని కూడా ఆదరించిన శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వం పాజిటివ్ గా చదివితే మరింత గొప్పగా అర్థం అవుతుంది. మిగిలిపోయిన ఈ జీవితంలో కనీసం ఇప్పటికైనా రామాయణ పారాయణం చేయాలని కోరుతూ మావోను విడిచిపెట్టి మా రాముడిని గుండెలో నిలుపుకోవాలని... మార్క్స్ ను విడిచిపెట్టి కనీసం మల్లెమాల రామాయణం అయినా చదవాలని.. స్టాలిన్ ను సంకలోంచి దించి మొల్ల యొక్క రామభక్తిని అందుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ రాముడు దేవుడని రామాయణం చదవడం మొదలుపెడితే తప్పకుండా ఇతడు దేవుడే అనిపిస్తాడు. లేదా రాముడు మానవుడని రామాయణం చదవడం మొదలుపెడితే తప్పకుండా అతనిలో దైవత్వం కనిపిస్తుంది... ఓ ప్రపంచ మేధావులారా... జగమెరిగిన రచయితల్లారా..! మంథర మారీచుల్లారా! రామాయణం చదవండి రామ భక్తి లో మునగండి. *@ శ్రీకౌస్తుభ.. ప్రముఖ సాహిత్య రాజకీయ విమర్శకులు...*
Your experience on this site will be improved by allowing cookies.