మోది నీ మూడో సరి ప్రధాని చేయడానికి మద్దతుగా ఈ విజయ సంకల్ప యాత్ర చేపట్టాము.. రాష్ట్రం లోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది.. తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో యాత్ర పూర్తి చేసుకుని ఈరోజు ఇక్కడికి చేరుకుంది హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బిజెపి ఊహా రచన చేస్తుంది.. Mim కంచుకోటగా చెప్పుకుంటున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈ సారి బిజెపి కైవసం చేసుకుంటుంది.. కేవలం బడా వ్యాపారులకు కొమ్ము కాస్తూ.. పేద ప్రజలను పట్టించుకోని mim కి ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారు.. కాంగ్రెస్ కూడా హామీల అమలు విషయంలో మాట మారుస్తుంది.. ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య అన్నట్లు ఉంది కాంగ్రెస్ ది.. మొదటగా అందరికీ ఆరు గ్యారెంటీ లు అని చెప్పి.. ఇప్పుడేమో కండీషన్లు అంటుతుంది.. ఎన్నికల ముందు అందరికీ 500 వందల గ్యాస్ సిలిండర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కొంత మందికి మాత్రమే అని కండిషన్స్ చెబుతున్నారు.. మన రాష్ట్రం లో తెలంగాణ 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికే సిలిండర్ ఇస్తున్నాడు.. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ పథకాలు ప్రారంభిస్తున్నారు.. ఎన్నికల తరువాత అమలు చేస్తారనే నమ్మకం లేదు.. ఫ్రీ బస్ అంటూ పబ్లిసిటీ చేసి డీలక్స్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు.. సరిపడా బస్సులు లేకుండా చేసి పధకం అమలు చేస్తున్నాం అని చెబుతున్నారు.. డిల్లీ కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ కాంగ్రెస్ ఏటిఎం గా మారుతుంది.. తెలంగాణ సంపద తో డిల్లీ కాంగ్రెస్ కి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వనుంది.. పేద ముస్లింలు అభివృద్ధి చెందకుండా ఓల్డ్ సిటీ కి మెట్రో రాకుండా mim చేయింది.. రోడ్లు కూడా విస్తరించకుండా చేస్తుంది కూడా ఓవైసీ నే.. ఏ ప్రభుత్వం అధికారం లోకి వస్తే వారి పక్కన చేరడం ఓవైసీ ల పని.. వారి అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి ఎవరితోనైనా చేతులు కలుపుతారు.. కర్ణాటకలో నాసిర్ షా ఎమ్మెల్సీ గా గెలిచిన తరువాత పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు.. పాకిస్థాన్ జిందాబాద్ అనే స్థాయి కి దిగజారింది కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయం పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలి.. దేశం కోసం పనిచేసే బిజెపి కి ఈ సారి ఓటు వేసి గెలిపించండి.. ఒక్క సారి బిజెపి కి అవకాశం ఇచ్చి చూడండి హైదరాబాద్ ఎలా డెవలప్ చేస్తామో తెలుస్తుంది..
సందర్బంగా ప్రధానితో పాటు గవర్నర్,మంత్రులు రానున్నారు.పీఎంకు స్వాగతం పలికెందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఏరోడ్రమ్ వద్ద నేతలు దిగనున్న 8 హెలిప్యాడ్ లను పరిశీలంచారు.ఆమె వెంట ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు,కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, మహబూబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేథన్, ట్రైనీ ఐపీఎస్ చైతన్య,బొథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్,ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు,కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
రాయికల్ మండలం కైరీ గూడెం గ్రామంలో రెండు అత్యంత నిరుపేద కుటుంబలకు సామాజిక సేవకులు కడకుంట్ల జగదీశ్వర్ శ్వేత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిత్యావసర సరుకులు బియ్యం, పప్పు నూనెలు కూరగాయలు పంపిణీ చేశారు. ఇట్టి సందర్భంగా గ్రామస్తుడు సిపెల్లి నర్సయ్య మాట్లాడుతూ కరొన కాలంలో వేలాది పేదలకు నిత్యావసర సరుకులు అందజేసిన జగదీశ్వర్ శ్వేత దంపతుల సేవ నిరతి అభినందనీయం అని వారి సేవ నిరతి విరామం లేకుండా కొనసాగడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నరేష్ ,మల్లేష్, మిత్రులు ఎద్ధండిముత్యంపు రాజు రెడ్డి,చింతకుంట సాయికుమార్, సయ్యద్ రసూల్, ఇమ్మడి విజయ్, గంట్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.