|
modi add 1

పగిడిద్దరాజు దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు

పగిడిద్దరాజు దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ రోజు మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజక వర్గం లోని గంగారాం మండలం పునుగొండ్ల గ్రామములో పగిడిద్దరాజు దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు అనంతరం జాతరకు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి గారు అన్నారు ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెమ్ లచ్చు పటేల్,పూజారులుతో పాటు స్థానిక ఎంపీపీ,జెడ్పీటీసీ లు మండల అధ్యక్షులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | February 19, 2024 | 0 Comments

బిజెపి డా. లక్ష్మణ్ ఎంపీ@ చార్మినార్ అస్సెంబ్లీ..

మోది నీ మూడో సరి ప్రధాని చేయడానికి మద్దతుగా ఈ విజయ సంకల్ప యాత్ర చేపట్టాము.. రాష్ట్రం లోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది.. తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో యాత్ర పూర్తి చేసుకుని ఈరోజు ఇక్కడికి చేరుకుంది హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బిజెపి ఊహా రచన చేస్తుంది.. Mim కంచుకోటగా చెప్పుకుంటున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈ సారి బిజెపి కైవసం చేసుకుంటుంది.. కేవలం బడా వ్యాపారులకు కొమ్ము కాస్తూ.. పేద ప్రజలను పట్టించుకోని mim కి ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారు.. కాంగ్రెస్ కూడా హామీల అమలు విషయంలో మాట మారుస్తుంది.. ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య అన్నట్లు ఉంది కాంగ్రెస్ ది.. మొదటగా అందరికీ ఆరు గ్యారెంటీ లు అని చెప్పి.. ఇప్పుడేమో కండీషన్లు అంటుతుంది.. ఎన్నికల ముందు అందరికీ 500 వందల గ్యాస్ సిలిండర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కొంత మందికి మాత్రమే అని కండిషన్స్ చెబుతున్నారు.. మన రాష్ట్రం లో తెలంగాణ 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికే సిలిండర్ ఇస్తున్నాడు.. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ పథకాలు ప్రారంభిస్తున్నారు.. ఎన్నికల తరువాత అమలు చేస్తారనే నమ్మకం లేదు.. ఫ్రీ బస్ అంటూ పబ్లిసిటీ చేసి డీలక్స్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు.. సరిపడా బస్సులు లేకుండా చేసి పధకం అమలు చేస్తున్నాం అని చెబుతున్నారు.. డిల్లీ కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ కాంగ్రెస్ ఏటిఎం గా మారుతుంది.. తెలంగాణ సంపద తో డిల్లీ కాంగ్రెస్ కి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వనుంది.. పేద ముస్లింలు అభివృద్ధి చెందకుండా ఓల్డ్ సిటీ కి మెట్రో రాకుండా mim చేయింది.. రోడ్లు కూడా విస్తరించకుండా చేస్తుంది కూడా ఓవైసీ నే.. ఏ ప్రభుత్వం అధికారం లోకి వస్తే వారి పక్కన చేరడం ఓవైసీ ల పని.. వారి అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి ఎవరితోనైనా చేతులు కలుపుతారు.. కర్ణాటకలో నాసిర్ షా ఎమ్మెల్సీ గా గెలిచిన తరువాత పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు.. పాకిస్థాన్ జిందాబాద్ అనే స్థాయి కి దిగజారింది కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయం పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలి.. దేశం కోసం పనిచేసే బిజెపి కి ఈ సారి ఓటు వేసి గెలిపించండి.. ఒక్క సారి బిజెపి కి అవకాశం ఇచ్చి చూడండి హైదరాబాద్ ఎలా డెవలప్ చేస్తామో తెలుస్తుంది..

By NYALAKONDA ANIL DESAI | February 28, 2024 | 0 Comments

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు

ఈ రోజు వేంకటా పూర్ మండలం బూర్గుపేట గ్రామానికి చెందిన బినవేని శ్రీలత ఆనందపూర్ గ్రామానికి చెందిన గుమ్మడి లక్ష్మీ మరియు ఆకులవారి పల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ లు మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పొరిక బలరాం నాయక్ గార్లు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments

కొత్తగూడ & గంగారం మంత్రి సీతక్క పర్యటన

ములుగు అసెంబ్లీ మహబూబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండల కేంద్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క సుడిగాలి పర్యటన చేశారు కొత్తగూడ స్థానిక మండల కేంద్రం గాంధీనగర్లో సిసి రోడ్లు ప్రారంభోత్సవం చేశారు జవహర్లాల్ నెహ్రూ యువజన సంఘం 25 లక్షల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు గంగారం మండల కేంద్రంలో కస్తూరి గాంధీ విద్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం అదనపు భవనం మంజూరు కాగా భూమి పూజ చేసిన మంత్రి సీతక్క, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆరు గ్యారెంటీలో ఈరోజు మహబూబాద్ జిల్లా ఎస్సీ విద్యుత్ అధికారి జనగాం నరేష్ సార్ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ జీరో బిల్లును లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ... జిల్లాలో మొట్టమొదటిసారిగా బావురుకొండ నుంచి గృహజ్యోతి పథకం జీరో బిల్లును లబ్ధిదారులకు అందజేయడం గర్వంగా ఉందని అన్నారు కోమట్ల గూడ కోదండ రామాలయం అభివృద్ధి పనులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతంలో నన్ను ఆదరించిన వారందరినీ నేను ఎప్పటికీ మర్చిపోను ఈ ప్రాంత బిడ్డల్ని విద్యా వైద్యం పోడు భూముల సమస్యలను అన్ని సమస్యల పరిష్కరించి ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా ప్రతి కుటుంబానికి చేరవేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు కోమట్ల గూడెంలో మంత్రి సీతక్కను ఘన సన్మానం చేశారు, బావూరుకొండలో గ్రామస్తులు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలోనే గృహ జ్యోతి పథకం జీరో బిల్ ఇచ్చినందుకు పెద్ద మొత్తంలో వ్యవసారంగానికి పంటలు పండుటకు ఉచిత విద్యుత్ లో భాగంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఇచ్చినందుకు మంత్రి సీతక్కను గ్రామస్తులు గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | March 02, 2024 | 0 Comments

గృహ ప్రవేశానికి హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

-గృహ ప్రవేశానికి హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఈ రోజు ములుగు పట్టణ కేంద్రము ప్రగతి కాలనీ లో వేంకటాపూర్ మండలం నర్సాపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొచ్చు అశోక్ గారి నూతన గృహ ప్రవేశానికి మరియు ములుగు పట్టణ కేంద్రానికి చెందిన జ్యోతి అనీల్ వివాహం ఇటీవలే జరగగా నూతన దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

By NYALAKONDA ANIL DESAI | March 28, 2024 | 0 Comments

త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం

-త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం -రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చెయ్యడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి -రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంఖా మోగించడం ఖాయం -కష్టపడి పని చేసిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటా -అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీ లు అమలు చేశాం *రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు* ఈ రోజు ములుగు పట్టణ కేంద్రములో జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టం ఆహారభద్రత,ఉపాధి హామీ సమాచార హక్కు,విద్య హక్కు చట్టాలు తిసుకచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది పేదలకు ఏడు విడుతలుగా భూపంపిణీ చేశామని ఇప్పుడు ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక,రైతు వ్యతిరేక నల్లా చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ కంపెనీల కు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ అప్పులు మాఫీ చేసిందని ప్రతి ఒక్క కుటుంబములో 15 లక్షల రూపాయలు వేస్తానని మోసం చేసిన నీచమైన చరిత్ర బిజెపి పార్టీ మోడీ ప్రభుత్వానిది ఉద్యోగాలు కల్పించకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన బిజెపి కి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని 100 ఏనుగుల తిన్న రాబందు ఒక్క గాలి వానతో కుప్పకులినట్లు 10 యేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్ ప్రజలు ఇచ్చిన తీర్పు తో బి ఆర్ ఎస్ నాయకులు మా ప్రభుత్వం పై ఇస్తమున్నట్లు మాట్లాడటం సిగ్గు చేటని మంత్రి సీతక్క గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని మన ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కష్ట పడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్,మరియు ములుగు మండల క్లస్టర్ ఇంఛార్జి లు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

By NYALAKONDA ANIL DESAI | March 28, 2024 | 0 Comments

సీఎం రేవంత్ రెడ్డి గారిని కలసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క

ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కలసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ గారు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు.అనంతరం జ్ఞాపికను అందజేశారు.ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ గారిని ప్రకటింటించినందుకు సిఎం గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ-పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ గారు తదితరులు ఉన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 29, 2024 | 0 Comments

డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో డబ్ల్యూ జే ఐ ప్రతినిధులు వారిని కలిసి జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ చేపట్ఠిన, చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మంత్రులు పాత్రికేయులకు, ప్రజలకు తెలుగు వత్సర శుభాభినందనలు తెలిపారు. సమస్యలపై పోరాటంలో తాము జర్నలిస్టుల వెంట కలిసి నడుస్తామని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ, ప్రధాన కార్యదర్శి నరేంద్ర భండారి, సీనియర్ ఉపాధ్యక్షుడు సంజయ్ సక్సేనాలు తమ సందేశాల్లో పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు , పాత్రికేయులకు వారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, కార్యదర్శి క్రాంతి ముదిరాజ్, నగర అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 28, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1