సంపద సృష్టించే ప్రజలు జనారణ్యంలో ఉంటే మావోలు దండకారణ్యం గుహల్లో 'మకాం చేస్తే పేదరికం దారిద్య్రం తొలగిపోతుందా?... పారిపోతుందా?... తత్వమైతే ఎలా ?.... ఉద్యమం ప్రారంభమైన దశాబ్దం.. రెండు దశాబ్దాల అనంతరమైనా మావోలు తమ కార్యాచరణను మూల్యాంకనం చేసుకుని, ఆత్మ విమర్శ చేసుకుని ఉండాల్సింది. కాంబోడియా, కొలంబియా, వియత్నాం, నేపాల్ తదితర దేశాల అనుభవాలను బేరీజు వేసుకుని దేశ ప్రజలకు మేలైన సేవలు అందించడంలో నిమగ్నమై ఉంటే వారి ఉనికిని ప్రజలు గుర్తించేందుకు ఆస్కారం ఉండేది. హైదరాబాద్ సహా భారతదేశం మొత్తం అభివృద్ధిలో దూసుకుపోతున్న దృశ్యం స్పష్టంగా కనబడుతోంది. అనేక గణాంకాలు, భౌతిక మార్పులు కళ్లకు కడుతున్నాయి. విదేశీ పెట్టుబడుల (ఎఫ్ఐల) వెల్లువ వచ్చిపడుతోంది. పుష్కర కాలం నాటి పరిస్థితికి, నేటి స్థితికి పొంతనలేని రీతిలో అనూ హ్యమైన అభివృద్ధి, సానుకూల, పాజిటివ్ వాతావరణం జిగేల్ మంటూ మెరుస్తోంది. విదేశీ మారక నిల్వలు గలగలలాడుతున్నాయి. జాతి సంపద (జిడిపి) ఇబ్బడిముబ్బడిగా పెరగటంతో ప్రజ ల తలసరి ఆదాయంలో గణనీయమైన మార్పు వచ్చింది. దీన్ని నిశ్శబ్దవిప్లవంగా పరిగణించకతప్పదు. ఇదేదో మసి పూసి మారేడుకాయ చేయటం కాదు. జాతీయ అంతర్జాతీ య ఆర్థిక మదింపు సంస్థల గణాంకాలు, నివేదికలు వాటి చెబుతున్న సత్యం. మన వ్యోమగాములు త్వరలో చంద మామ పైకి వెళుతున్నారు. విచిత్రమేమిటంటే ఈ నిశ్శబ్ద విప్లవాన్ని చూడ నిరాకరించే భారత మావోయిస్టులు రక్తపాత, సాయుధ విప్లవం కోసం దండకారణ్యాన్ని ఎర్రబార్చడం విషాదం, తాజాగా ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో ఫిబ్రవరి 27న జరిగిన భారీ ఎన్ కౌంటర్లో నలుగురు సాయుధ మావోలు మరణించారు. కొందరు ఆ ఘటన నుండి తప్పించుకున్నా రని ఆ జిల్లా ఎస్పీ ప్రకటించారు. వారికి చెందిన తుపాకులు, కిట్ బ్యాగులు, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీన పరచుకున్నాయి. ఆదివారం కంఠేర్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ముగ్గురు మావోలు మరణించారు. ఇలాంటి వార్తలు చత్తీనగఢ్ దండకారణ్యం నుండి తరచుగా వెలువడు తూ ఉన్న విషయం తెలిసిందే. అలా అరణ్యాన్ని రక్తంతో ఎర్ర బార్చడం వలన విప్లవం వికసించే వర్ధిల్లే అవకాశాలు ఏమై నా ఉన్నాయా? అని ప్రశ్నించుకుంటే శూన్యం.. అనే సమా ధానం వస్తుంది. మరి ఆ మాత్రం దానికి అమాయకులైన ఆదివాసీలు, పేదలు ఇంతమంది ఎందుకు తమ ప్రాణాల్ని బలి ఇవ్వాలి? ఇది కోటి రూకల ప్రశ్న. ఆదివారం నాడు మావోలు అమర్చిన శక్తిమంతమైన మందుపాతర పేలి ఓ పోలీసు అధికారి మరణించారు. జనవరి 30న జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. అటు అమాయక ప్రజలు, ఇటు పోలీసులు జవాన్లు ఆకారణంగా నిశ్శబ్ద విపవం సాయుధ మరణించడం వల్ల ఒరిగేదేమిటి? నిజాయితీగా ప్రశ్నించు కుంటే.. హళ్లికి హళ్లి- సున్నకు సున్నా. అన్న జవాబే కనిపి స్తోంది. మరి ఇదెలా గొప్ప ప్రజా ఉద్యమం, పోరాటం అనిపించుకుంటుంది? గత 65 సంవత్సరాలకు పైగా ఇదే సాయుధ పోరాటం చేస్తూ ఉన్నపుడు... ఎంతోకొంత ఫలితం కనిపించాలి కదా? మావోలు మరింత అరణ్యంలోని లోతట్టు ప్రాంతాలకు తరలివెళ్లటం మినహా మరో పరిణామమేదీ కనిపించడం లేదు. మరోపక్క ప్రధాన జనజీవన స్రవంతిలో గత ఆరు దశాబ్దాల పరిణామాలను పరిశీలిస్తే నిశ్శబ్ద విప్లవం' కనబడు తోంది. మరి మావోల సాయుధ రక్తపాత విప్లవంతో నిశ్శబ్ద విప్లవాన్ని అందరూ నిశితంగా పరిశీలించి ఫలితాలను బేరీజు వేసుకోవాలి. మావోల ఊహాత్మక సిద్ధాంతాలు, విధానాలకు కాలం రెళ్లినట్టు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పేద ప్రజలే వాటిదెప్పా రు... చెబుతున్నారు. తాజా చరిత్ర దీనికి అద్దం పడుతోంది. అయినా భారత మావోయిస్టులు మాత్రం తమ సౌకర్యార్ధం దాన్ని విస్మరించి దశాబ్దాల క్రితం, నిళ్ళలు విప్లవం అంతగా చోటుచేసుకొని సమయంలో సమ్మిన విశ్వసించిన సిద్ధాంతా లకు, విధానాలకు మాత్రమే కట్టుబడి దండకారణ్యాన్ని ఎర్ర బారుస్తామనడం ఎలా విజ్ఞత- వివేకమనిపించుకుంటుంది? తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికార సాధన అనే నినాదం పూర్తిగా తెరమరుగైంది. ప్రాసంగికతను కోల్పోయింది. ప్రపంచం ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తోంది. అక్కున చేర్చుకుంటోంది. ఒకప్పుడు కమ్యూనిజాన్ని- మావోయిణా న్ని నమ్మిన దేశాలు సైత ప్రజాస్వామ్యం వైపు మొగ్గాయి. మన పొరుగు దేశం నేపాల్ ఇందుకు చక్కటి ఉదాహరణ. ఒకప్పుడు నేపాల్ మావోయిస్టు నాయకుడు ప్రచండతో భారత మావోలు సత్సంబంధాలు తెరిపి, స్నేహంగా మసిలి న వారు మరి అక్కడి పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకో వాలి కదా?... దాన్ని వదిలేసి, రష్యా-చైనా, తూర్పు యూర ప్, ఆగ్నేయాసియాలోని దేశాల్లో కమ్యూనిస్టు వ్యవస్థలు- మా సిద్ధాంతాలు ప్రజలచే తిరస్కరణకు గురైన సంగతిని పట్టించుకోకుండా ఇలా దండకారణ్యంలో ఆ విఫల ప్రయో గంపై మరోసారి ప్రయోగం వేస్తామని అసంఖ్యాక పేదల ప్రాణాలు తీయడం ఎలా గొప్ప రాజనీతిజ్ఞత అనిపించుకుం టుంది?... సిద్ధాంతాలు, రాజకీయ విధానాలు ప్రజం సాధికా రతను పెంచేందుకు, వారి సంక్షేమం మెరుగు పడేందుకు ఉపయోగపడాలి తప్ప శవాల దెబ్బలు పోగేయడానికైతే ఎలా? దాన్ని ఎవరైనా ఎలా శ్రమిస్తారు?. ఎందుకు క్షమించా బి... ప్రపంచంలో అన్ని రంగాలలో గొప్ప మార్పు కనిపి స్తుండగా, భారతదేశం అతి త్వరలో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగనున్నదని అంతర్జాతీయ సంస్థలు నిష్పాక్షికంగా ప్రకటిస్తూ ఉంటే, సంపద ఘనంగా పెరుగుతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తుండగా, ఇందుకు విరుద్ధమైన కమ్యూని స్టు- మావోయిస్టు పద్ధతి విధానంతో రాజ్యాధికారం కోసం దండకారణ్యంలోని అబూక్ష్మమ్లో మావోలు తిష్టవేయ డం విచిత్రమైన వింతైన వ్యవహారం తప్ప మేలైన మెరుగైన ఆలోచన ఆసలే కాదు. సంపద సృష్టించే ప్రజలు జనారణ్యంలో ఉంటే మావోలు దండకారణ్యం గుహల్లో 'మకాం చేస్తే పేదరికం- దారిద్య్రం తొలగిపోతుందా?... పారిపోకుండా?... ఇంత అమాయక త్వమైతే ఎలా?.. ఉద్యమం ప్రారంభమైన దశాబ్దం.. రెండు దశాబ్దాల అనంతరమైనా మావోలు తమ కార్యాచరణను మూల్యాంకనం చేసుకుని, ఆత్మ విమర్శ చేసుకుని ఉండాల్సిం ది. కాంబోడియా, కొలంబియా, వియత్నాం, నేపాల్ తదితర దేశాల అనుభవాలను బేరీజు వేసుకుని దేశ ప్రజలకు మేలైన సేవలు అందించడంలో నిమగ్నమై ఉంటే వారి ఉనికిని ప్రజ లు గుర్తించేందుకు ఆస్కారం ఉండేది. అలాగాక త్యాగాలతో ప్రారంభించిన పోరాటాన్ని మధ్యలో నిలిపివేయరాదని, కాడి వదిలేయ కూడదని మొండి బేషజాలకు పోతే అడెలా ప్రజానుకూల వైఖరి, విధానం అనిపించుకుంటుంది?.. వ్యక్తిగత స్థాయిలో అలాంటి వైఖరికి మంచి మార్కులు పడతాయేమోగాని అశేష ప్రజల జీవితాలకు, వారి భవిష్యత్ కు సంబంధించిన విషయాన్ని ఇలా అమానవీయ- అరాచక రీతిలో నిర్ణయించడంలో అర్థం లేదు. ఇదే కొనసాగితే ఎన్నటికైనా చరిత్ర వారిని క్షమించదు. సంపద పెరగడంతో వర్ణమానంలో రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టులను మరిపించేలా రూపాంతరం చెందుతున్నాయి. వండేభారత్ రైళ్లు పెరుగెడుతున్నాయి. జాతీయ రహదారు లు నాలుగు-ఆరు లేన్నతో అలరారుతున్నాయి. జల రవాణా పెరిగింది. సరకుల రవాణాయే గాక ప్రయాణీకుల కోసం పడవలు, సౌకర్యవంతమైన విలాస వంతమైన పడవలు తిరుగుతున్నాయి. ఈ 21వ శతాబ్దపు అభివృద్ధికి 'ఇదును'గా భావించే సెమీ కండక్టర్ల (చిప్స్) తయారీ దేశంలో జరగనున్నది. ఈ ఒక్క రంగమే దేశ భవిష్యత్ను మార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే సంప్రదాయ ఇంధనానికి ప్రత్యామ్నా యంగా, అణు విద్యుత్తు, పవన-జల విద్యుత్ కై పెద్ద ప్రాజెక్టు ల పని ప్రారంభమైంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా సంపదను అనూహ్యంగా పెంచే దిశగా అడుగు లు పడుతున్నాయి. ఇదంతా నిశ్శబ్ద విప్లవమే కదా?.. దీన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. ఇందులో ప్రజలు భాగస్వాము బై తమ వాటాను రాము అందుకుంటున్నారు. జీవితాల్ని మెరుగు పరచుకుంటున్నారు. మరి మావోల రక్తపాత సాయుధ విప్లవం వల్ల ఒనగూరిన- ఒనగూరుతున్న మేలు ఏమిటి?.. ఈ పశ్న వేయడంలో, వేసుకోవడంలో ఎవరూ సంకోచించాల్సిన అవసరం లేదు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. మావోల ఇలాకాలో మందుపాతరలు పేలడం, తుపాకి శబ్దాలు వినబడటం, కీకారణ్యంలో కవాతు చేయడం తప్ప మరొకటి ఏమీ లేదు కదా? త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తిరిగి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువు దీరనున్నదని అన్ని సర్వేలు చాటి చెబుతున్నాయి. మూడో సారిమోడీ ప్రధాని కావడం ఖాయమని రాజకీయ పండితు లు అంచనా వేస్తున్నారు. ఇదంగా మరో రెండు మూడు మాసాల్లో తెలుతుంది. అప్పుడు 'నిశ్శబ్ద విప్లవం మరింత ఊపందుకోబోతోంది. ఆ మేరకు మోడీ సూచన ప్రాయంగా అప్పుడే తెలిపారు. మరి మావోయిస్టుల రక్తపాత- సాయుధ విప్లవానికి తావెక్కడిది?... హోంమంత్రి అమితా ఇప్పటికే మావోలను దండకారణ్యం నుంచి తరిమికొట్టేందుకు సంకల్పం చెప్పుకున్న సంగతి మరువరాదు. ఈ నేపథ్యంలో మావోలు సంతానికి దిగితే ప్రజలకు మేలు జరుగుతుం దా?... కీడు కలుగుతుందా?.. అని ఎవరికి వారే ప్రశ్నించుకు సమాధానం చెప్పుకోవలసిందే. - - పుప్పల నరసింహం సీనియర్ జర్నలిస్టు 99857 81799
Your experience on this site will be improved by allowing cookies.